తాడేపల్లిగూడెం మాజీ మున్సిపల్ చైర్మన్, బీజేపీ నేత ఈతకోట తాతాజీకి(భీమ శంకరరావు) కరోనా సోకింది. ఆయనకు కరోనా సోకినట్టు గుర్తించక ముందు, మాజీ మంత్రి మాణిక్యాలరావు ఆయనతో కలిసి కారులో ప్రయాణించారు. తాతాజీకి కరోనా సోకినట్టు తెలిసి మాణిక్యాల రావు కూడా ముందు జాగ్రత్తగా కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకోగా పాజిటివ్గా నిర్ధారణ అయింది.
కరోనా బారిన పడిన మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ త్వరగా కోలుకోవాలని జూలై 25న ట్వీట్ చేసిన మాణిక్యాలరావు తన ఆరోగ్య పరిస్థితిపై వదంతులు ఎవరు నమ్మవద్దని, కంగారు పడవద్దని, అధైర్య పడవద్దని ట్వీట్ చేశారు.
తాను ఆరోగ్యంగానే ఉన్నానని చెప్పారు. భగవంతుని ఆశీస్సులతో, అందరి ఆదరాభిమానాలతో తాను పరిపూర్ణ ఆరోగ్యంతో తిరిగి వస్తానని మాణిక్యాల రావు చివరిగా ట్వీట్ చేశారు. అంత ధైర్యంగా ఉన్న మాణిక్యాలరావు కరోనా వల్ల మరణించడంతో ఆయన అనుచరులు దిగ్భ్రాంతికి లోనయ్యారు.

More Stories
కేంద్రం అనుమతి నిరాకరణతో రేవంత్ అమెరికా పర్యటన రద్దు
దేశ నిర్మాణంలో యువత పాత్రపై ఆర్ఎస్ఎస్ సమావేశాల్లో విస్తృతంగా చర్చ
పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్ వద్ద రాహుల్ మెరుపు ధర్నా.. నడ్డా ఆగ్రహం