
ఈ మ్యాగజైన్ కవర్పేజీపై ఢిల్లీలోని నిజాముద్దీన్ మర్కజ్ కార్యక్రమానికి హాజరైన వారి ఫొటోతోపాటు ఢిల్లీ అలర్ల ఫొటోలను ముద్రించారు. విశ్వాసులు గొప్పగా నిలబడతారని, అవిశ్వాసులు పడిపోతారని రాసుకొచ్చింది. అలాగే, అవిశ్వాసులను నిర్మూలించే చర్యలు తీసుకోవడానికి సిద్ధంగా ఉండాలని అనుచరులను సిద్ధం చేసింది.
‘‘ఎల్లప్పుడూ ఆయుధాలు కలిగి ఉండండి. అవిశ్వాసులను చంపే అవకాశం వదులుకోవద్దు. వారిని కొట్టి చంపేందుకు చైన్లు, తాళ్లు, వైర్లు సిద్ధంగా ఉంచుకోండి’’ అని అందులో పేర్కొంది. అంతేకాదు, గాజు లాంటి పదునైన వస్తువులైతే సులభంగా చంపొచ్చని కూడా పేర్కొంది. కత్తెర్లు, సుత్తులు కూడా బాగానే ఉపయోగపడతాయని వివరించింది.
ఐసిస్ తన ‘లాక్డౌన్ ఎడిషన్’లో మౌలానా సాద్, జమాత్లను కూడా ప్రశంసించింది. కరోనా సూపర్ స్ప్రైడర్లుగా మారారని ప్రశంసించింది. అలాగే, ఢిల్లీ అల్లర్లకు సంబంధించి జామియా మిలియా ఇస్లామియా విద్యార్థులను అరెస్ట్ చేయడంపైనా తీవ్రంగా స్పందించింది.
ఈ అరెస్టులకు ప్రతీకారం తీర్చుకోవాలని ముస్లింలను కోరింది. ముస్లింలు కరోనా వైరస్ వాహకాలుగా మారి పోలీసులకు అంటించాలని, అవిశ్వాలను ఎదుర్కొనేందుకు కరోనాను ఆయుధంగా ఉపయోగించుకోవాలని సూచించింది.
More Stories
సైబర్ నేరగాళ్ల చేతిలో 16.80 కోట్ల మంది పర్సనల్ డేటా
రాహుల్ కు రెండేళ్ల జైలు శిక్ష.. అనర్హత వేటు తప్పదా!
ఔట్ సోర్సింగ్ నియామకాలతోనే పేపర్ లీకేజి!