తిరుమలలో అర్చకుడు సహా 10 మందికి కరోనా

లాక్‌డౌన్ సడలింపుల తర్వాత శ్రీవారి దర్శనం కోసం తిరుమలకు భక్తులు భారీ సంఖ్యలో వస్తున్నారు. దీనికి అనుగుణంగా టీటీడీ ఆలయాధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టారు. వైరస్ వ్యాప్తి చెందకుండా భౌతిక దూరం పాటిస్తూ.. దర్శనానికి అవకాశం కల్పించారు. 
 
అయినా కూడా కరోనా వ్యాప్తి చెందుతూనే ఉంది. తిరుమలకు వచ్చే భక్తులకే ఇప్పటి వరకు సోకిన వైరస్ తాజాగా టీటీడీలో 10 మందికి వైరస్ సోకింది. వీరిలో స్వామివారికి పూజా కైంకర్యాలు చేసే అర్చకుడికి కూడా కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో అప్రమత్తమైన అధికారులు శానిటైజేషన్ పనులు పూర్తి చేశారు.
 
వైరస్ సోకిన వారిలో నలుగురు సన్నాయి వాయిద్యకారులు, ఓ అర్చకుడు,ఐదుగురు సెక్యూరిటీ గార్డులు ఉన్నట్టుగా ఆలయాధికారులు తెలిపారు. వారందరినీ చికిత్స  కోసం ఆస్పత్రులకు తరలించారు. వారి కుటుంబ సభ్యులకు కూడా పరీక్షలు చేయాలని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి సూచించారు. 
 
ఇప్పటికే తిరుమలకు వచ్చే భక్తులందరికీ అలిపిరిలోనే థర్మల్ స్క్రీనింగ్ ను చేస్తున్నారు. అనారోగ్యంగా ఉన్నవారిని  అనుమతించడం లేదు.