
జమ్మూకాశ్మీర్లో గత 24 గంటల్లో జరిగిన రెండు వేర్వేరు ఎన్కౌంటర్లలో 8 మంది ఉగ్రవాదులు చనిపోయారు. పంపోర్ జిల్లాల్లో మసీదులో దాక్కున్న ఇద్దరు టెర్రరిస్టులను హతమార్చినట్లు అధికారులు చెప్పారు. మసీదుకు ఎలాంటి డ్యామేజ్ కాకుండా, కాల్పులు జరపకుండా, ఐఈడీలు ఉపయోగించకుండా దుండగులను బయటికి రప్పించి హతమార్చామని పేర్కొన్నారు.
షోపియాన్, పంపోర్ రేంజ్లో టెర్రరిస్టులు దాగి ఉన్నారనే పక్కా సమాచారంతో భద్రతా సిబ్బంది కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. ఆ సమయంలో టెర్రరిస్టులు కాల్పులు జరపడంతో ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ కాల్పుల్లో షోపియాన్ జిల్లాలో ఐదుగురు, పంపోర్ జిల్లాకు చెందిన ముగ్గురు ఉగ్రవాదులు చనిపోయినట్లు అధికారులు చెప్పారు.
గురువారం ఉదయం నుంచి శుక్రవారం ఉదయం వరకు ఆపరేషన్ కొనసాగినట్లు తెలుస్తోంది. ఇద్దరు ఉగ్రవాదులుమసీదులో దాక్కున్నారని, టియర్ గ్యాస్ ఉపయోగించి వారిని బయటికి రప్పించి కాల్చి చంపినట్లు చెప్పారు.
More Stories
నన్ను జడ్జ్ చేయడానికి మీకున్న అర్హత ఏమిటి?
మరోసారి ప్రధాని మోదీని ప్రశంసించిన శశిథరూర్
ఉచితాలు, సబ్సిడీలపై సభలో పకడ్బందీ చర్చ జరగాలి