
చిత్తూరు జిల్లా కాణిపాక ఆలయంలో విధి నిర్వహణలో ఉన్న హోంగార్డుకు కరోనా పాజిటివ్ నిర్ధారణ కావడంతో సోమవారం ఆ ఆలయాన్ని మూసివేశారు. రెండు రోజుల అనంతరం ఆలయాన్ని తెరవనున్నట్లు ఆలయ ఇఒ వెంకటేష్ తెలిపారు.
లాక్డౌన్లో భాగంగా 77 రోజుల పాటు ఆలయంలో భక్తుల ప్రవేశాన్ని నిలిపేశారు. రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిషనర్ ఉత్తర్వుల మేరకు ఈ నెల 8, 9 తేదీల్లో ట్రయల్ రన్ నిర్వహించి 10 తేదీ నుంచి సాధారణ భక్తులకు దర్శనం కల్పిస్తున్నారు. ఆలయంలో సుమారు 500 మంది సిబ్బంది వివిధ శాఖల్లో విధులు నిర్వహిస్తున్నారు.
ఈ నెల 12న తొలివిడత 60 మంది ఆలయ సిబ్బందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. ఆలయంలో హోంగార్డుగా విధులు నిర్వహిస్తున్న వ్యక్తికి పాజిటివ్ వచ్చింది. ఆ హోంగార్డు ఎక్కడెక్కడ తిరిగాడు, ఎవరిని కలిశాడు అని అధికారులు ఆరా తీస్తున్నారు. రెండు రోజుల అనంతరం భక్తులకు పునర్ధర్శనం కల్పించనున్నారు.
More Stories
ఆసక్తి కలిగిస్తున్న అమిత్ షాతో చంద్రబాబు భేటీ
తెలుగు రాష్ట్రాల్లో 12 రైళ్లు రద్దు
నారా లోకేష్పై ప్రొద్దుటూరులో కోడి గుడ్ల దాడి