గత కొన్ని రోజులుగా దేశ రాజధానిలో నిత్యం 6 వేలకు పైగా కరోనా కేసులు నమోదవుతన్నాయి. అయితే ఈ మహమ్మారి ప్రభావంతో మాజీ క్రికెటర్, భారతీయ జనతా పార్టీ ఎంపీ గౌతం గంభీర్ ఐసోలేషన్లోకి వెళ్లారు.
తన నివాసంలో ఒకరికి కరోనా పాజిటివ్ నిర్ధారణ కావడంతో స్వీయ నిర్బంధంలోకి వెళ్తున్నట్లు ఆయన ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. కొవిడ్ టెస్టులకు తన నమూనాలను పంపించారు. ప్రతి ఒక్కరూ కొవిడ్ నిబంధనలు పాటించాలని, ఎవరూ కూడా తేలికగా తీసుకోవద్దని గంభీర్ విజ్ఞప్తి చేశారు.
ఇదిలాఉంటే దేశ రాజధాని ఢిల్లీలో రోజురోజుకు కరోనా పాజిటివ్ కేసులు పెరిగిపోతూనే ఉన్నాయి. ప్రతి రోజు 6 వేలకుపైగా కేసులు నమోదవుతున్నాయి. దీంతో అప్రమత్తమైన ఢిల్లీ సర్కార్ కొవిడ్ నిబంధనలు పాటించాలంటూ హెచ్చరికలు జారీ చేసింది.
More Stories
రాహుల్ గాంధీ `పాకిస్తాన్ అనుచరుడు’
బ్రిజ్ భూషణ్ సింగ్ కు బిజెపి సీట్ నిరాకరణ!
అయోధ్య రామమందిరంలో రాష్ట్రపతి ప్రత్యేక పూజలు