రష్యా- ఉక్రెయిన్, ఇజ్రాయిల్- ఇరాన్ యుద్ధాలు ప్రపంచంలో ఘర్షణ వాతావరణాన్ని సృష్టించాయని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఏ సమయంలోనైనా యుద్ధానికి దారి తీసే పరిస్థితి ఏర్పడుతోందని పేర్కొన్నారు. నాగ్పూర్లో ఆదివారం జరిగిన ‘బియాండ్ బోర్డర్స్’ అనే పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొంటూ పెద్ద అగ్రరాజ్యాల నియంతృత్వం, నిరంకుశత్వం కారణంగా సమన్వయం, సామరస్యం, ప్రేమ కనుమరుగవుతున్నాయని విచారం వ్యక్తం చేశారు.
నేడు మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఘర్షణ పూరిత వాతావరణం నెలకొందని తెలిపారు. రష్యా-ఉక్రెయిన్, ఇజ్రాయెల్- ఇరాన్ మధ్య యుద్ధాలు జరుగుతున్నాయని పేర్కొంటూ ఏ సమయంలోనైనా యుద్ధం లాంటి పరిస్థితి తలెత్తే పరిస్థితులు ఏర్పడుతున్నాయని చెప్పారు. భారతదేశ సాంస్కృతిక వారసత్వాన్ని ఆయన ప్రశంసిస్తూ భారత్ బుద్ధుడి భూమి అని, ఇది ప్రపంచానికి సత్యం, అహింస, శాంతి సందేశాన్ని అందించిందని పేర్కొన్నారు.
యుద్ధ సాంకేతికత ఇప్పుడు పూర్తిగా మారిపోయిందని నితిన్ గడ్కరీ తెలిపారు. ఇప్పుడు ట్యాంకులు, సాంప్రదాయ విమానాలు ఉపయోగం తక్కువగా ఉందని, అయితే మిస్సైల్స్, డ్రోన్ల వంటి ఆధునిక ఆయుధాలు ఎక్కువగా ఉపయోగపడుతున్నాయని తెలిపారు. ఇప్పుడు మిస్సైల్స్ను జనవాసాలపై వేస్తున్నారని, దాంతో మానవాళి రక్షించడం కష్టమవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇది ప్రపంచ స్థాయిలో చర్చించాల్సిన తీవ్రమైన సమస్యగా ఆయన సూచించారు.

More Stories
భారతదేశం ఇప్పుడు నక్సల్ రహిత దేశం
యూపీలో ఇకపై రోడ్లపై నమాజ్ చేస్తే చర్యలు
నీట్ పేపర్ లీక్ లో ఆర్సీసీ వ్యవస్థాపకుడు శివరాజ్ అరెస్టు