దాదాపు ఐదు వేల మందికి పైగా బలగాలను కేంద్రం వెనక్కి పిలిపిస్తున్నది. ఇందులో భాగంగా తెలంగాణ – ఛత్తీస్గఢ్ సరిహద్దులోని సీఆర్పీఎఫ్ కోబ్రా జవాన్లు తమ హెడ్ క్వార్టర్స్లో రిపోర్ట్ చేయాలని ఆదేశాలు జారీచేసింది. ఈ నేపథ్యంలో ములుగు జిల్లాలోని వెంకటాపురం, ఆలూబాక, వీరభద్రవరం, పామునూరు పెద్దగుట్ట పరిసరాల్లో మోహరించిన బలగాలు వెనక్కి మళ్లుతున్నాయి.
అయితే ఛత్తీసగఢ్ వైపు ఆపరేషన్ కగార్ యథావిధిగా కొనసాగుతుందని ప్రకటించింది. కేంద్రం ఆదేశాల మేరకు ఆదివారం ఉదయంలోగా భారత్- పాక్ సరిహద్దుకు బలగాలు వెళ్లనున్నాయి. కాగా, వచ్చే ఏడాది మార్చి నాటికి మావోయిస్టులు లేకుండా చేయడమే లక్ష్యంగా చేపట్టిన ఆపరేషన్ కగార్ దూకుడుగా సాగుతోంది. ఆపరేషన్ కగార్లో జరిగిన భారీ ఎన్కౌంటర్లో భారీగా మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయారు. వారిలో పలువురు అగ్రనేతలు కూడా ఉన్నారు.

More Stories
మక్తల్లో బీజేపీ అభ్యర్థి ఆత్మహత్య..ఎన్నిక రద్దు
ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ అగ్ని ప్రమాదంపై దర్యాప్తు జరపాలి
ఫోరెన్సిక్ ల్యాబొరేటరీలో అగ్ని ప్రమాదం వెనుక కుట్ర?