దాదాపు ఐదు వేల మందికి పైగా బలగాలను కేంద్రం వెనక్కి పిలిపిస్తున్నది. ఇందులో భాగంగా తెలంగాణ – ఛత్తీస్గఢ్ సరిహద్దులోని సీఆర్పీఎఫ్ కోబ్రా జవాన్లు తమ హెడ్ క్వార్టర్స్లో రిపోర్ట్ చేయాలని ఆదేశాలు జారీచేసింది. ఈ నేపథ్యంలో ములుగు జిల్లాలోని వెంకటాపురం, ఆలూబాక, వీరభద్రవరం, పామునూరు పెద్దగుట్ట పరిసరాల్లో మోహరించిన బలగాలు వెనక్కి మళ్లుతున్నాయి.
అయితే ఛత్తీసగఢ్ వైపు ఆపరేషన్ కగార్ యథావిధిగా కొనసాగుతుందని ప్రకటించింది. కేంద్రం ఆదేశాల మేరకు ఆదివారం ఉదయంలోగా భారత్- పాక్ సరిహద్దుకు బలగాలు వెళ్లనున్నాయి. కాగా, వచ్చే ఏడాది మార్చి నాటికి మావోయిస్టులు లేకుండా చేయడమే లక్ష్యంగా చేపట్టిన ఆపరేషన్ కగార్ దూకుడుగా సాగుతోంది. ఆపరేషన్ కగార్లో జరిగిన భారీ ఎన్కౌంటర్లో భారీగా మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయారు. వారిలో పలువురు అగ్రనేతలు కూడా ఉన్నారు.

More Stories
ఫిన్లాండ్లో తెలంగాణ విద్యార్థి అదృశ్యం
కంటోన్మెంట్లో 21 రోడ్లకు బ్రిటీషర్ల స్థానంలో భారితీయ వీరుల పేర్లు
కిషన్ రెడ్డి, కేంద్ర ప్రభుత్వంపై రేవంత్ రెడ్డి అబద్దాలు!