జమిలి ఎన్నికలు వచ్చినా 2029లోనే ఎన్నికలు

జమిలి ఎన్నికలు వచ్చినా 2029లోనే ఎన్నికలు

జమిలి అమల్లోకి వచ్చినా, ఎన్నికలు జరిగేది 2029లోనేనని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టంచేశారు. ఒక దేశం, ఒకే ఎన్నిక విధానానికి ఇప్పటికే తమ మద్దతు ప్రకటించామని ఆయన వెల్లడించారు. జమిలిపై అవగాహన లేని వైఎస్సార్సీపీ రెండేళ్లలో జరుగుతాయని పబ్బం గడుపుకోవటానికి ఏది పడితే అది మాట్లాడుతోందని ఆయన మండిపడ్డారు.

వైఎస్సార్సీపీ నేతల మాటలు ప్రజల్లో ఎప్పుడో విశ్వసనీయత కోల్పోయాయన్న ఆయన, వాళ్లు చేసే డ్రామాలు చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో సుస్థిర ప్రభుత్వం కొనసాగుతుందని తెలిపారు. స్వర్ణాంధ్ర విజన్ 2047 డాక్యుమెంట్​ను మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని సీఎం కోరారు.

 
విశ్వవిద్యాలయాలు, కళాశాలలు, పాఠశాలలతోపాటు ప్రతి చోటా దీనిపై చర్చ జరగాలని, విజన్ 2020 సాకారమైన తీరు నేటి తరం తెలుసుకోవాలని చెప్పారు.
1996 నాటి ఆంధ్రప్రదేశ్ పరిస్థితులు, 2020 నాటి పరిస్థితులు బేరీజు వేస్తే విప్లవాత్మక మార్పులు అందరి కళ్లకూ కనిపిస్తున్నాయన్న సీఎం, 2047లోనూ ఇదే పునరావృతం అవుతుందని భరోసా వ్యక్తం చేశారు. 
 
స్వర్ణాంధ్ర విజన్ 2047 డాక్యుమెంట్ ఒకరోజు పెట్టి వదిలేసే కార్యక్రమం కాదన్న ఆయన, భవిష్యత్తు తరాల బాగు కోసం చేసే ఈ ప్రయత్నంలో అందరి భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. రేపటి తరం భవిష్యత్తు కోసమే ఈ విజన్ 2047 అని స్పష్టం చేశారు. సాగునీటి సంఘాలు, సహకార, ఇతరత్రా ఎన్నికల ప్రక్రియ షెడ్యూల్ ప్రకారం పూర్తి చేస్తామని తెలిపారు. 
 
ఈసారి పెట్టే కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో ఎన్నో మార్పులు తీసుకొస్తామని అన్నారు. సుదీర్ఘ సమీక్షలకు తావివ్వకుండా ప్రశ్నలు- సమాధానాల రూపంలో దీనిని నిర్వహిస్తామని తెలిపారు. ముందుగానే కలెక్టర్లు, ఎస్పీలకు చర్చించాల్సిన అంశాలపై అజెండా పంపి వాటిపై సమాధానాలు కోరతామని చెప్పారు. తద్వారా సమయాన్ని సద్వినియోగం జరగటంతో పాటు మంత్రులు- అధికారుల మధ్య ఇంట్రాక్షన్ పెరుగుతుందని పేర్కొన్నారు. 
 
ఆస్పత్రిలో చేరిన బిజెపి అగ్రనేత అద్వానీ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు. అద్వానీతో తనకు దశాబ్దాలుగా అనుబంధం ఉందని చెబుతూ ఆనాడు ఏపీ అభివృద్ధిలో అద్వానీ సహకారం మరువలేనిద