వక్ఫ్ బిల్లుపై చిర్రెత్తి సీసా పగలగొట్టిన టిఎంసి ఎంపీ

వక్ఫ్ బిల్లుపై చిర్రెత్తి సీసా పగలగొట్టిన టిఎంసి ఎంపీ

కేంద్రం తీసుకొచ్చిన వక్ఫ్ బిల్లుపై ఏర్పాటైన సంయుక్త పార్లమెంటరీ కమిటీ సమావేశంలో మంగళవారం గందరగోళం నెలకొంది. సమావేశం ప్రారంభమైన కొద్దిసేపటి ఎంపీలు వాగ్వావాదానికి దిగారు.వాదోపవాదాలు తీవ్రం అయినప్పుడు టిఎంసి ఎంపీ కళ్యాణ్ బెనర్జీ చిర్రెత్తిపోయాడు. బిజెపి నేత అభిజిత్ గంగోపాధ్యాయ తో వాదోపవాదానికి దిగినప్పుడు తిక్కరేగిందంతే ఫటేల్ మని నీళ్ల సీసా పగులగొట్టేశాడు. ఈ కారణంగా కొద్దిసేపు సమావేశం ఆగిపోయింది.

ఈ సందర్భంగా ఆయన బొటన వేలు, చూపుడు వేలు కు గాయమైంది. వెంటనే ఆయనకి ప్రథమ చికిత్స చేశారు. ఆ తర్వాత మజ్లీస్ పార్టీ చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ, ఆప్ నాయకుడు సంజయ్ సింగ్ సమావేశ గదికి తోడుగా ఉండి తిరిగి తీసుకొచ్చారు. ఆయన పరిస్థితి చూసి అధికారులు కూడా సూప్ ఇచ్చారు.

బిజెపి కి చెందిన జగదంబిక పాల్ కమిటీ సమావేశానికి అధ్యక్షత వహించారు. ఆయన రిటైర్డ్ జడ్జీలు, న్యాయవాదుల గ్రూప్ అభిప్రాయాలు వింటుండగా, ప్రతిపక్ష సభ్యులు ‘‘బిల్లులో మీ స్టేక్ ఏమిటి?’’ అని నిలదీశారు. ఎంపీ కళ్యాణ్ బెనర్జీ దుందుడుకు ప్రవర్తన చూసి ఆయన్ని పార్లమెంటరీ కమిటీ తీవ్రంగా పరిగణించింది. కల్యాణ్ బెనర్జీని ఒకరోజు సస్పెండ్ చేస్తూ కమిటీ నిర్ణయం తీసుకుంది.

రిటైర్డ్ జడ్జీలు, సుప్రీం కోర్టు లాయర్లు హాజరైన ఈ సమావేశంలో కల్యాణ్ బెనర్జీ అప్పటికే మూడుసార్లు మాట్లాడారు. మరోసారి మాట్లాడే అవకాశం కావాలని కోరారు. అయితే దీనికి బీజేపీ ఎంపీ అభిజిత్ గంగోపాధ్యాయ అభ్యంతరం తెలిపారు. దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది.  ఈ క్రమలో ఎంపీలు దుర్భాషలాడినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. అక్కడే ఉన్న గ్లాస్ వాటర్ బాటిల్ను టేబుల్కేసి కొట్టగా బెనర్జీ చేతికి గాయమైంది. అనంతరం పగిలిన బాటిల్ను ఛైర్మన్ వైపు విసిరేశారు. ఫలితంగా సమావేశం వాయిదా పడింది.

సోమవారం జరిగిన జేపీసీ సమావేశంలో కూడా సభ్యులు వాగ్వాదానికి దిగారు. విపక్ష సభ్యులు లేవనెత్తిన ప్రశ్నలకు బీజేపీ సభ్యులు కౌంటర్ ఇచ్చారు. వక్ఫ్ బిల్లుపై సంప్రదింపుల ప్రక్రియపై విపక్ష సభ్యులు ప్రశ్నలు సంధించారు. రాజకీయ కారణాలతో ముస్లింలను లక్ష్యంగా చేసుకుని ప్రభుత్వం ఈ బిల్లును ప్రవేశపెడుతోందని ఆరోపించారు. 

ఈ బిల్లుపై ఏఐఎమ్ఐఎమ్ నేత అసదుద్దీన్ ఓవైసీ దాదాపు గంట పాటు ప్రెజంటేషన్ ఇచ్చారు. బిల్లు వల్ల వచ్చే చిక్కులపై ఆందోళన వ్యక్తం చేశారు. అయికే, వక్ఫ్ ఆస్తి నిర్వహణలో సంస్కరణలు తీసుకురావడానికి, పారదర్శకతకు భరోసా ఇవ్వడానికి ఈ బిల్లు అవసరమని బీజేపీ సభ్యులు వాదించారు.