ఇప్పటివరకూ ఈ కేసులో మొత్తం 16 మందిని అదుపులోకి తీసుకోగా, అందులో ముగ్గురు ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన ముఖ్య నేతలున్నారు. ఈ కేసులో కేజ్రీవాల్ ‘కింగ్పిన్’ అని, కొందరు వ్యక్తులకు మేలు చేసేందుకు డబ్బులు (లంచం) అడిగారని రౌస్ అవెన్యూ కోర్టుకు శుక్రవారం ఈడీ వెల్లడించింది. మద్యం విధానం రూపకల్పనలో కేజ్రీవాల్కు ప్రత్యక్ష పాత్ర ఉందని తెలిపింది.
ఈ కేసులో సహ నిందితురాలుగా ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కే.కవిత వాంగ్మూలాన్ని కూడా తీసుకున్నామని ఈడీ ప్రస్తావించింది. లిక్కర్ పాలసీ రూపకల్పనలో భాగంగా ఎమ్మెల్సీ కవితను కేజ్రీవాల్ కలిశారని, కలిసి పని చేద్దామంటూ చెప్పారని ఈడీ పేర్కొంది. అక్రమ మార్గంలో వచ్చిన ఈ డబ్బుని గోవా ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఉపయోగించిందని పేర్కొంది.
మద్యం విధానం రూపకల్పనలో కేజ్రీవాల్కు ప్రత్యక్ష పాత్ర ఉందని, స్కామ్లో ప్రధాన వ్యక్తి ఆయనేనని తెలిపింది. ఇక ఈ కేసులోనే అరెస్టయిన ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం, ఆప్ నేత మనీష్ సిసోడియా బెయిల్ లభించలేదని న్యాయస్థానం దృష్టికి ఈడీ పేర్కొంది. ఆప్ మాజీ కమ్యూనికేషన్స్ ఇన్ఛార్జ్ విజయ్ నాయర్ సీఎం అరవింద్ కేజ్రీవాల్ వద్ద పనిచేస్తున్నారని, కేజ్రీవాల్తో చాలా సన్నిహితంగా ఉండే విజయ్ నాయర్ మధ్యవర్తిగా నటించాడని ఈడీ పేర్కొంది.
సౌత్ గ్రూప్ నుంచి కేజ్రీవాల్ డబ్బు డిమాండ్ చేశారని, ఈ విషయాన్ని నిరూపించడానికి తమ వద్ద ఆధారాలు ఉన్నాయని ఈడీ తరపు న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. రెండు పర్యాయాలు నగదు బదిలీ జరిగిందని వివరించారు. సౌత్ గ్రూప్కు లిక్కర్ పాలసీలో లబ్ది చేకూర్చేందుకు ముడుపులు తీసుకున్నారని వివరించారు.
విజయ్ నాయర్ అరవింద్ కేజ్రీవాల్ కోసం పనిచేశారని, గోవా ఎన్నికల సమయంలో రూ.45 కోట్లు చేతులు మారాయని కోర్టుకు ఈడీ వెల్లడించింది. ఈ కేసుకు సంబంధించిన ఆధారాలలో ఫోన్ రికార్డ్స్ కూడా ఉన్నాయని రౌస్ అవెన్యూ కోర్టుకు ఈడీ తెలిపింది. విజయ్ నాయర్కు సంబంధించిన కంపెనీ నుంచి ఆధారాలు సేకరించామని, రూ.45 కోట్లు హవాలా మార్గంలో తరలించినట్టు తేలిందని, పెద్ద మొత్తంలో నిధులు వివిధ వ్యక్తుల ద్వారా చేతులు మారాయని వివరించింది.
More Stories
లోక్సభ ఎన్నికల నాలుగో దశ పోలింగ్ నేడే
మోదీ వారణాసిలో రేపే నామినేషన్.. ఘనంగా రోడ్ షో
అల్లు అర్జున్ పర్యటనతో నంద్యాల ఎస్పీపై వేటు