
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఏకంగా 8 మంది ఎమ్మెల్యేలపై అసెంబ్లీ స్పీకర్ అనర్హత వేటు వేశారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీలు ఇచ్చిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై విచారణ చేపట్టి న్యాయ నిపుణుల సలహా తీసుకున్న అనంతరం స్పీకర్ ఈ నిర్ణయం ప్రకటించారు. ఈ మేరకు సోమవారం రాత్రి అధికారిక ఉత్తర్వులను స్పీకర్ కార్యాలయం జారీ చేసింది.
పార్టీ ఫిరాయించారన్న ఫిర్యాదులతో ఎనిమిది మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేస్తూ నిర్ణయం తీసుకున్నారు. శాసనసభలో ఈ ఎనిమిది స్థానాలూ ఖాళీ అయినట్లు అసెంబ్లీ సెక్రటరీ జనరల్ పీపీకే రామాచార్యులు ఎన్నికల సంఘానికి వెంటనే సమాచారాన్ని పంపారు. రాష్ట్ర విభజన తర్వాత అసెంబ్లీలో ఇంత పెద్ద సంఖ్యలో ఎమ్మెల్యేలపై వేటు పడడం ఇదే తొలిసారి.
గెలిచిన పార్టీని విడిచి మరో రాజకీయ పార్టీకి మారడంతోనే వీరిపై అనర్హత వేటు వేశారు. ఈ నిర్ణయం ఏ పార్టీకి కలిసి వస్తుందనేది రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. మరోవైపు, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతుండటంతో అధికార వైయస్సార్సీపీ ప్రచారంలో దూసుకుపోతోంది. సిద్ధం సభలతో సీఎం జగన్ ప్రజల్లోకి తమవైపునకు తిప్పుకుంటున్నారు. అభ్యర్థుల ప్రకటనలోనూ జగన్ పార్టీ ముందే ఉంది. ఇక, తెలుగుదేశం, జనసేన పార్టీలు కూడా బహిరంగ సభలు, యాత్రలు, ర్యాలీలతో ప్రజల్లోకి వెళుతున్నాయి.
More Stories
పోలవరం నిర్వాసితులకు పునరావాస హామీలు నెరవేర్చాలి
టిడిపిలో చేరిన ముగ్గురు వైసీపీ ఎమ్యెల్సీలు
జీఎస్టీ 2.0 సంస్కరణలు స్వాగతించిన ఏపీ అసెంబ్లీ