పోటీ పరీక్షలు జరిగినప్పుడు ప్రశ్నపత్రాలు లీక్ చేసి డబ్బులు దండుకునే వారికి కేంద్ర ప్రభుత్వం చెక్ పెట్టనుంది. ప్రశ్నాపత్రాలు లీకేజీ లాంటి వ్యవస్థీకృత నేరాలను అడ్డుకునేందుకు ఉద్దేశించిన పబ్లిక్ ఎగ్జామినేషన్ (ప్రివెన్షన్ ఆఫ్ అన్ఫెయిర్ మీన్స్-2024) బిల్లును కేంద్ర సర్కారు సోమవారం లోక్సభ ముందుకు తీసుకొచ్చింది.
కేంద్రమంత్రి జితేందర్సింగ్ ఈ పబ్లిక్ ఎగ్జామినేషన్ బిల్లును లోక్సభలో ప్రవేశపెట్టారు. ప్రశ్నాపత్రాల లీకేజీకి పాల్పడే అధికారులు, ముఠాల ఆగడాలకు ఈ బిల్లుతో కళ్లెం పడే అవకాశం ఉంది. ఈ బిల్లు చట్టంగా మారితే.. ఈ చట్టం కింద నిందితులకు గరిష్టంగా పదేళ్ల జైలుశిక్ష, నేర తీవ్రతను కోటి రూపాయల వరకు జరిమానా విధిస్తారు.
రాజస్థాన్, హర్యానా, గుజరాత్, బీహార్ రాష్ట్రాల్లో పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్ష ప్రశ్నపత్రాలు లీకయ్యాయి. అభ్యర్థులు గందరగోళానికి గురయ్యారు. ఈ నేపథ్యంలో కేంద్రం తాజా బిల్లును తీసుకువచ్చింది. కాగా, పబ్లిక్ ఎగ్జామినేషన్ బిల్లును తీసుకురానున్నట్లు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉభయసభలను ఉద్దేశించి ఇటీవల చేసిన ప్రసంగంలో పేర్కొన్నారు.
More Stories
ఎంపీగా గెలుపొందితే బాలీవుడ్కు కంగనా వీడ్కోలు
కేజ్రీవాల్ నిరసన పిలుపుతో ఢిల్లీలో ఉద్రిక్తత
ఆరు నెలల్లో భారత్ లో భాగం కానున్న ఆక్రమిత కాశ్మీర్