ఆక్రమిత కాశ్మీర్ నుంచి భారత్లోకి ఉగ్రవాదులను పంపించి, ఉగ్రదాడులకు పాల్పడేలా పాకిస్తాన్ అరాచకాలకు దిగుతుంది. ఈ క్రమంలోనే పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని ప్రముఖ ఆలయమైన శారదా ఆలయాన్ని ప్రస్తుతం పాక్ ఆర్మీ ఆక్రమించిందని, ఆ ఆలయ కమిటీ సేవ్ శారద కమిటీ వ్యవస్థాపకుడు రవీంద్ర పండిత స్వయంగా వెల్లడించారు.
శారద ఆలయాన్ని ఆక్రమించిన పాకిస్థాన్ సైన్యం ఆలయ పరిసరాల్లో కాఫీ హోంని కూడా ఏర్పాటు చేసిందని రవీంద్ర పండిత బెంగళూరులో మెదయ్యతో మాట్లాడుతూ తెలిపారు.శారదా ఆలయంలో పాకిస్థాన్ ఆర్మీ అక్రమంగా ఏర్పాటు చేసిన కాఫీ హోం ఆక్రమణలను తొలగించడానికి నరేంద్ర మోదీ నేతృత్వంలోని భారత ప్రభుత్వం చొరవ తీసుకోవాలని రవీంద్ర ఆయన కోరారు.
వాస్తవానికి ఈ స్థలం విషయంలో సేవ్ శారదా కమిటీకి అనుకూలంగా కోర్టు తీర్పు కూడా ఉందని ఆయన గుర్తు చేశారు కోర్టు తీర్పు తమకు అనుకూలంగా ఉన్నప్పటికీ పాక్ సైన్యం మాత్రం ఆ స్థలాన్ని ఆక్రమించి నిర్మాణాలు చేపడుతోందని తెలిపారు. శారదా ఆలయం గోడలను ధ్వంసం చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.
పీఓకేలోని శారదా ఆలయంలో పాకిస్థాన్ ఆర్మీ చేస్తున్న దురాగతాలను తాము వ్యతిరేకిస్తూ తీవ్రంగా పోరాడుతున్నామని చెప్పారు. పీవోకేలోని స్థానిక ప్రజలు కూడా సేవ్ శారదా కమిటీకి మద్దతుగా నిలుస్తున్నారని తెలిపారు. అయితే తాము చేస్తున్న ఈ పోరాటానికి భారత ప్రభుత్వం కూడా మద్దతు తెలపాలని కోరుతున్నట్లు రవీంద్ర పండిత విజ్ఞప్తి చేశారు.
ఈ వ్యవహారంపై వెంటనే భారత ప్రభుత్వం జోక్యం చేసుకొని పీఓకేలోని శారదా ఆలయ పునరుద్ధరణకు చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. శారద ఆలయాన్ని అభివృద్ధి చేసి, దానికి వారసత్వ సంపద గుర్తింపును ఇవ్వాలనని రవీంద్ర పండిత విజ్ఞప్తి చేశారు.
More Stories
దక్షిణాదిన భారీ వర్షాలు.. ఉత్తరాదిన వడగాల్పులు
4 దశలలో మొత్తం 66.95 శాతం పోలింగ్
కోవాగ్జిన్ తీసుకున్న 30 శాతం మందిలో ఆరోగ్య సమస్యలు