సమాజంలో అత్యంత వెనుకబడిన జనాభా వివరాలు, వారి ప్రస్తుత సామాజిక, ఆర్థిక స్థితిగతులు ప్రభుత్వాల వద్ద కచ్చితమైన గణాంకాలతో ఉన్నప్పుడు మాత్రమే అందరికీ సమానమైన, నిజమైన అభివృద్ధి సాధ్యమవుతుందని సుప్రీంకోర్టు ధర్మాసనం అభిప్రాయపడింది. సమాజంలోని అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు సక్రమంగా అందాలన్నా, కులగణన అనేది ఎంతగానో ఉపయోగపడుతుందని, ఇది నేటి సామాజిక పరిస్థితుల్లో ఎంతైనా తప్పనిసరి అని గౌరవ న్యాయమూర్తి స్పష్టం చేశారు.
అలాగే, వివిధ సంక్షేమ పథకాల సరైన పంపిణీకి ఆయా రాష్ట్రాల్లో, దేశంలో ఎంతమంది వెనుకబడిన కులాల వారున్నారో స్పష్టంగా తెలుసుకోవాల్సిన అవసరం ప్రభుత్వాలకు ఉందని వ్యాఖ్యానించింది. సుప్రీంకోర్టు ఇచ్చిన ఈ తిరుగులేని చారిత్రాత్మక తీర్పుతో దేశవ్యాప్తంగా కులగణన ప్రక్రియను మరింత వేగంగా ముందుకు తీసుకెళ్లేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఉన్న అన్ని రకాల చట్టపరమైన అడ్డంకులు, న్యాయపరమైన చిక్కులు పూర్తిగా తొలగిపోయినట్లయింది.
ఈ పిల్ ను సుధాకర్ గుమ్ముల అనే వ్యక్తి దాఖలు చేశారు. కుల ఆధారిత డేటా సేకరణను రాజకీయ నాయకులు, కార్పొరేట్ సంస్థలు దుర్వినియోగం చేసే ప్రమాదం ఉందని ఆయన వాదించారు. ఇంత భారీ స్థాయిలో కుల డేటా సేకరణకు సరైన కారణం లేదని కోర్టుకు తెలిపారు.
ఇదిలా ఉండగా దేశంలోనే మొదటిసారిగా జనగణనను పూర్తిగా డిజిటల్ పద్ధతిలో నిర్వహిస్తున్నారు. డిజిటల్ విధానం వల్ల డేటా సేకరణలో కచ్చితత్వం పెరగడమే కాకుండా, డేటాను విశ్లేషించడం కూడా సులభతరం కానుంది. ఇక చివరి సారి 2011లో జనగణన జరిగింది. 2021లో మళ్లీ జనాభా లెక్కల సేకరణ జరగాల్సి ఉంది. అయితే కరోనా మహమ్మారి కారణంగా ఆ ప్రక్రియ వాయిదా పడింది. దాదాపు 15 ఏళ్ల తర్వాత దేశవ్యాప్తంగా ఈ ప్రక్రియ జరుగుతోంది.

More Stories
సూర్యాస్త్ర రాకెట్ వ్యవస్థ ప్రయోగం విజయవంతం
కుట్రపూరితంగానే రైళ్లలో అగ్ని ప్రమాదాలు
భారతీయుల డేటా చోరీపై సుప్రీంకోర్టు కీలక ఆదేశం