కాగా, నెం.06079 తాంబరం-సంత్రాగచ్చి ప్రత్యేక సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్ రైలు ఈ నెల 15, 22 తేదీల్లో మధ్యాహ్నం 1 గంటకు తాంబరంలో బయల్దేరి మరుసటిరోజు రాత్రి 8.45 గంటలకు సంత్రాగచ్చి చేరుకుంటుంది. అలాగే, నెం.06080 సంత్రాగచ్చి – తాంబర ప్రత్యేక సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్ రైలు ఈనెల 16, 23 తేదీల్లో రాత్రి 11.40 గంటలకు సంత్రాగచ్చిలో బయల్దేరి మూడవరోజు ఉదయం 9.35 గంటలకు తాంబరం చేరుకుంటుంది.
ఈ రైళ్లు చెన్నై ఎగ్మూర్, గూడురు, విజయవాడ, రాజమండ్రి, సామర్లకోట, దువ్వాడ, సింహాచలం నార్త్, విజయనగరం, పలాస, కుర్దా రోడ్డు, భువనేశ్వర్, కటక్, భద్రక్, బాలాసోర్, ఖరగ్పూర్ స్టేషన్లలో ఆగుతాయి. కాగా, నెం.06081 తాంబరం – భువనశ్వేర్ ప్రత్యేక సూపర్ఫాస్ట్ రైలు ఈ నెల 21న మధ్యాహ్నం 1 గంటకు తాంబరంలో బయల్దేరి మరుసటిరోజు ఉదయం 9.55 గంటలకు భువనేశ్వర్ చేరుకుంటుంది.
అలాగే, నెం.06082 భువనేశ్వర్ – తాంబరం ప్రత్యేక సూపర్ఫాస్ట్ రైలు ఈ నెల 22వ తేది మధ్యాహ్నం 12.50 గంటలకు భువనేశ్వర్లో బయల్దేరి మరుసటిరోజు మధ్యాహ్నం 12 గంటలకు తాంబరం చేరుకుంటుంది.
కేరళలోని శబరిమల అయ్యప్ప స్వామి ఆలయం ఈ నెల 17న తెరుచుకోనుంది. ఈ ఏడాది మండల- మకరవిళక్కు వేడుకలు శుక్రవారం నుంచి ప్రారంభమవుతాయి. అయ్యప్ప స్వామి భక్తుల కోసం అన్ని ఏర్పాట్లు చేసినట్లు కేరళ మంత్రి కే రాధాకృష్ణన్ మంగళవారం చెప్పారు. భక్తుల సౌకర్యం కోసం అధునాతన సాంకేతికతను వినియోగిస్తున్నట్టు తెలిపారు. భక్తుల రద్దీని నియంత్రించేందుకు డైనమిక్ క్యూ కంట్రోల్ సిస్టమ్ను అమలు చేస్తున్నామన్నారు.
More Stories
నలుగురు ఐఎస్ ఉగ్రవాదులు అహ్మదాబాద్ లో పట్టివేత
జెల్ తో రొమ్ము క్యాన్సర్ చికిత్స
దక్షిణ భారతదేశం అంతటా ఏనుగుల గణన