తాను గతంలో అమ్మేసిన ఆస్తుల్ని ఎన్నికల అఫిడవిట్లో అసెట్స్లో చూపించాల్సిన అవసరం లేదని, అదే కారణంగా ఎన్నిక చెల్లదని తీర్పునివ్వడం సరికాదని సుప్రీంకోర్టు అభిప్రాయపడినట్లు బండ్ల చెప్పారు. తనకు నోటీసులు ఇవ్వకుండానే ఇచ్చినట్టు ప్రత్యర్థులు హైకోర్టును తప్పుదోవ పట్టించారని ఎమ్మెల్యే కృష్ణ మోహన్ రెడ్డి చెప్పారు.
తనకు 2018 ఎన్నికల్లో 28వేల ఓట్లతో మెజార్టీ లభించిందని చెప్పారు. ఎన్నికల ముందు మూడు నెలలకు ముందే భూముల్ని అమ్మేశానని, తనపై తప్పుడు ఆరోపణలు చేశారని బండ్ల చెప్పారు. తన వాదన పరిగణలోకి తీసుకోకుండా హైకోర్టులో తీర్పు వెలువడిందని తెలిపారు.
మరోవైపు హైకోర్టు ఉత్తర్వుల ఆధారంగా గద్వాల ఎమ్మెల్యే విషయంలో కేంద్ర ఎన్నికల కమిషన్ కీలక ఆదేశాలు ఇచ్చింది. హైకోర్టు ఉత్తర్వులను పాటించి తక్షణమే డీకే అరుణను ఎమ్మెల్యేగా నోటిఫై చేస్తూ గెజిట్ ప్రకటించాలని ఆదేశించింది. హై కోర్ట్ ఆదేశాలు అమలు చేయాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారికి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శికి, అసెంబ్లీ కార్యదర్శికి కేంద్ర ఎన్నికల సంఘం లేఖ రాసింది. ఈ లేఖతో పాటు హైకోర్టు ఉత్తర్వులను జత చేసింది.
హైకోర్టు తీర్పును బండ్ల కృష్ణామోహన్ రెడ్డి సుప్రీం కోర్టులో సవాలు చేశారు. మరికొద్దిరోజుల్లో ఎన్నికలు సమీపిస్తున్న వేళ గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్రెడ్డికి గట్టి షాక్ తగలిందని భావించినా అనూహ్యంగా ఆయనకు ఊరట లభించింది.
2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ తరపున గెలిచిన కృష్ణమోహన్రెడ్డి తప్పుడు అఫిడవిట్ సమర్పించారంటూ డీకే అరుణ హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరపిన హైకోర్టు ఆగష్టు 24న కీలక తీర్పును ఇచ్చింది. తప్పుడు సమాచారం ఇచ్చిన కృష్ణ మోహన్ ఎన్నికల చెల్లదని ప్రకటించింది.
అంతేకాకుండా ప్రజాప్రాతినిధ్య చట్టం ప్రకారం కృష్ణమోహన్రెడ్డికి రూ.2.5 లక్షల జరిమానా విధించింది. పిటిషనర్ డీకే అరుణకు పిటిషన్ ఖర్చుల కింద రూ.50వేలు చెల్లించాలని ఆదేశించింది.
More Stories
తెలంగాణ మంత్రివర్గ సమావేశంకు ఈసీ అనుమతి
యాదాద్రి భక్తులకు డ్రెస్ కోడ్ తప్పనిసరి
వడ్ల కొనుగోలు వేగవంతం చేయండి రేవంత్