భారత్ పెద్దగా ఎదగడమే కాకుండా వేగంగా అభివృద్ధి చెందుతోందని చెబుతూ భారత దేశం అభివృద్ధి చెందితే ప్రపంచం అభివృద్ధి చెందుతుందని కొనియాడారు. మోదీ ప్రసంగిస్తుండగా ఆద్యంతం చప్పట్లతో మోదీ …. మోదీ … అంటూ అమెరికా కాంగ్రెస్ సభ్యులు నినదించారు. ప్రపంచభివృద్దికోసం భారత్ – అమెరికా కలిసి నడవాల్సిన అవసరం ఉందని ప్రధాని మోదీ తెలిపారు. అమెరికాలో ప్రఖ్యాత విద్యాలున్నాయని, భారత్ లో అతి పెద్ద యువశక్తి ఉందని చెబుతూ ఈ రెండు కలిస్తే సుస్థిర.. సమ్మిళిత ప్రపంచాభివృద్ధి సాధ్యమవుతుందని ప్రధాని వివరించారు.
ఉక్రెయిన్-రష్యా యుద్ధం ముగింపునకు భారత్ ఒత్తిడి చేస్తోందని చెబుతూ భారత్-అమెరికా డిఎన్ఎలోనే ప్రజాస్వామ్యం ఉందని మోదీ స్పష్టం చేశారు. భారత్లో వివక్షకు తావులేదని, కృతిమ మేథస్సు, సెమీ కండక్టర్ అంశాలే ప్రధానంగా చర్చలు జరుపుతున్నామని పేర్కొన్నారు. జి-20 హామీలను నిలబెట్టుకున్న ఏకైక దేశం భారత్ అని ప్రశంసించారు. హరిత హైడ్రోజన్ కేంద్రంగా భారత్ అవతరించనుందని తెలిపారు.
అంతకు ముందు, ఆమెరికా-బైడెన్ సంయుక్త ప్రకటన విడుదల సందర్భంగా భారత్-అమెరికా సంబంధాల్లో ముఖ్యమైన రోజు అని ప్రధాని మోదీ పేర్కొన్నారు. భారత్కు అమెరికా అతిపెద్ద వాణిజ్య భాగస్వామి అని ప్రశంసించారు. వాణిజ్య సమస్యలు పరిష్కరించుకోవాలని నిర్ణయించామని చెప్పారు. బెంగళూరు, అహ్మదాబాద్లో కాన్సులేట్ల ప్రారంభానికి నిర్ణయం తీసుకున్నామని, భారత్-అమెరికా మధ్య వాణిజ్య సహకారం విస్తరిస్తోందని పేర్కొన్నారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత్-అమెరికా ఉమ్మడి పోరాటం చేస్తుందని ప్రశంసించారు.
బెంగళూరు, అహ్మదాబాద్లో కాన్సులేట్ల ప్రారంభానికి నిర్ణయం తీసుకున్నామని, భారత్-అమెరికా మధ్య వాణిజ్య సహకారం విస్తరిస్తోందని పేర్కొన్నారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత్-అమెరికా ఉమ్మడి పోరాటం చేస్తుందని ప్రశంసించారు.
More Stories
కేజ్రీవాల్ పిఎ చెంపపై, కడుపులో కొట్టి, కాలుతో తన్నాడు
రక్షణ, వాణిజ్య రంగాల్లో చైనా, రష్యా మరింత సహకారం
జూన్ 4 తర్వాత కూటమి విచ్ఛిన్నం ఖాయం