జపాన్ రాయబారి హిరోషి సుజుకి భారత్ లో స్ట్రీట్ ఫుడ్ ని ఆస్వాదించిన వీడియోని పోస్ట్ చేశారు.మహారాష్ట్రలోని పుణెలో పర్యటించిన హిరోషి సుజుకి దంపతులు వడపావ్తో పాటు కొన్ని రకాల స్ట్రీట్ ఫుడ్ రుచి చూశారు. ఈ క్రమంలోనే భారతీయ స్ట్రీట్ ఫుడ్పై ప్రశంసించారు.
భారత దేశంలోని స్ట్రీట్ ఫుడ్ అంటే తనకు చాలా ఇష్టమని హిరోషి సుజకి చెప్పారు. అయితే కాస్తా మసాలా తగ్గించాలని కోరారు. ఆయన షేర్ చేసిన ఓ వీడియోపై స్పందించిన భారత ప్రధాని నరేంద్ర మోదీ తనదైన శైలిలో స్పందించారు.
భారతదేశపు పాక వైవిధ్యాన్ని ఇంత వినూత్నంగా ప్రదర్శించడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు. ఇలాంటి వీడియోలు చేస్తూ ఉండండి అని పేర్కొన్నారు. హిరోషి సుజుకి షేర్ చేసిన ఓ వీడియో ఆయన తక్కువ స్పైసీ కావాలని కోరగా.. అతని భార్య మాత్రం హాట్ స్పైసీ కావాలని కోరారు.
ఈ క్రమంలోనే తన భార్య తనను బీట్ చేసిందని పేర్కొన్నారు.
ఈ వీడియోపై స్పందించిన ప్రధాని మోదీ “మిస్టర్ అంబాసిడర్.. మీరు ఓడిపోయినా పట్టించుకోని పోటీ ఇది. మీరు భారతదేశపు పాక వైవిధ్యాన్ని ఆస్వాదించడం, దానిని ఇంత వినూత్న రీతిలో ప్రదర్శించడం చూసి సంతోషిస్తున్నాము. వీడియోలు వస్తూ ఉండనివ్వండి” అని ట్వీట్ చేశారు.
More Stories
44 శాతం పెరిగిన దళిత విద్యార్థుల అడ్మిషన్లు
కాంగ్రెస్, జేఎంఎం నేతల ఇళ్లలో కుప్పలుగా నల్లధనం
ఎంపీగా గెలుపొందితే బాలీవుడ్కు కంగనా వీడ్కోలు