ఒక్కసారి ఖాతాదారుల ఖాతాలలో తగినంత బ్యాలెన్స్ లేకుంటే బ్యాంకులు జరిమానా విధిస్తున్నాయి. ఈ సంప్రదాయానికి రిజర్వు బ్యాంకు చెక్ పెట్టింది. ప్రభుత్వ బ్యాంకుల్లో మినిమమ్ బ్యాలెన్స్ రూ. 2 లేదా రూ.3 వేలు ఉంటుంది. కొన్ని బ్యాంకుల్లో ప్రాంతాలను బట్టి కూడా కనీస మొత్తం నిర్ణయిస్తారు.
ఇక ప్రైవేటు బ్యాంకుల్లో అయితే రూ.5 నుంచి రూ.10 కనీస మొత్తం ఖాతాల్లో ఉంచాల్సి ఉంటుంది. లేకుంటే బ్యాంకులు జరిమానా విధిస్తాయి. ఛార్జీలు చెల్లించకుంటే బ్యాలెన్స్ మైనస్ లోకి వెళ్లిపోతుంది. ఎప్పుడైనా ఖాతాదారుడు అందులో డబ్బులు వేస్తే ఆటోమెటిగ్గా ఛార్జీలు డెబిట్ అయిపోతున్నాయి. దీంతో ఖాతాదారులు నష్టపోతున్నారు.
ఈ క్రమంలో బ్యాంకు ఖాతాదారులకి ఊరట కలిగించేలే చర్యలు చేపట్టింది ఆర్బీఐ. ఖాతాలో కనీస మొత్తం లేనందుకు బ్యాంకులు విధించే ఛార్జీలకు చరమగీతం పాడటానికి ఆర్బీఐ సిద్ధమవుతుంది. సేవింగ్ అకౌంట్లో బ్యాలన్స్ సున్నా ఉన్నప్పుడు మినిమమ్ బ్యాలెన్స్ మెయింటెనెన్స్ చేయనందుకు విధించే చార్జీలను నిలిపివేయాలని ఆర్బిఐ బ్యాంకులను కోరింది.
హెచ్డిఎఫ్సి బ్యాంక్ మినిమమ్ బ్యాలెన్స్ మెయింటెన్స్ చేయకపోయినా ఎటువంటి అదనపు ఛార్జీలు వసూలు చేయడం లేదని చెబుతోంది. మరో ప్రైవేట్ బ్యాంక్ యాక్సిస్ బ్యాంక్ ఇదే ప్రకటన చేసింది.
More Stories
చైనాలో ఆర్థిక సవాళ్లు నిజమేనన్న జిన్పింగ్
ఏప్రిల్లో గరిష్ట స్థాయికి చేరిన జీఎస్టీ వసూళ్లు
బాబా రాందేవ్కు సుప్రీంకోర్టు ప్రశంసలు