కర్నాటకలో ఒక్కలిగ సామాజిక వర్గాని కి చెందిన అసెంబ్లి సీట్లను జనతాదళ్ (ఎస్) నుం చి కైవసం చేసుకోవడానికి బీజేపీ సినీనటి సుమలతను రంగంలోకి దింపనున్నది. ఆమె కన్నడ సూపర్స్టార్, ఒక్కలిగ సామాజిక వర్గం నాయకుడు అంబరీష్ భార్య. అంబరీష్ కన్నుమూయడంతో ఆమె మాండ్య లోక్సభ స్థానానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
మే నెలలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ఆమెను మాండ్య అసెంబ్లీ స్థానానికి పార్టీ అభ్యర్ధినిగా ఎంపిక చేయాలని బీజేపీ నిర్ణయించిన్నట్లు చెబుతున్నారు. దక్షిణ కర్ణాటక ప్రాంతంలో మొత్తం 57 అసెంబ్లీ స్థానాలున్నాయి. వీటిలో కనీసం 20 సీట్లయినా బీజేపీ గెల్చేట్టు వ్యూహం రూపొందించాలని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆదేశించినట్టు తెలుస్తోంది. ఇందు కోసం సుమలతను ప్రచార సారథిగా చేయాలని నిర్ణయించినట్టు తెలియవచ్చింది.
కర్నాటకలో అసెంబ్లి ఎన్నికల బరిలో జనతాదళ్(ఎస్) లేకపోతే బీజేపీ మెజారిటీ సీట్లను కొల్లగొట్టుకుని పోయే ప్రమాదం ఉంది. కాంగ్రెస్ నాయకులు సిద్ధరామయ్య, డికె శివకుమార్ పార్టీ అధిష్టానానికి ఇదే విషయాన్ని స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య నేతృత్వంలో కాంగ్రెస్ 2013లో కన్నా, 2018 లో ఎక్కువ శాతం ఓట్లను సాధించింది. కానీ, సీట్లు మాత్రం కోల్పోయింది. జనతాదళ్ (ఎస్) కలిసి లేకపోవడం వల్లనే ఇలా జరిగిందని కాంగ్రె స్ నాయకులు పేర్కొంటున్నారు.
More Stories
పూంచ్ ఉగ్రదాడిలో పాక్ మాజీ కమాండర్
ఉద్రిక్తల నడుమ తొలిసారి మాల్దీవుల విదేశాంగ మంత్రి రాక
దలైలామాకు పివి నరసింహారావు మెమోరియల్ అవార్డు