తెలుగు రాష్ట్రాల్లో రెండు రోజులు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణలోని పలు జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ చేశారు. ఉపరితల ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో రెండు రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది.
సోమవారం తేలికపాటి నుంచి భారీ వర్షాలు, మంగళవారం తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ చేసింది. గంటకు సుమారు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలుల ప్రభావం ఉంటుందని అధికారులు పేర్కొన్నారు.
సోమవారం విదర్భ నుంచి మరత్వాడ, ఉత్తర ఇంటీరియర్ కర్ణాటక మీదుగా ఇంటీరియర్ తమిళనాడు వరకు సగటు సముద్ర మట్టానికి 0.9 కిలో మీటర్లు ఎత్తు వద్ద కొనసాగుతుందని వాతావరణ శాఖ తెలిపింది.
రాష్ట్రంలోని భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులు, గంటకు సుమారు 30 నుంచి 40 కిలో మీటర్ల వేగంతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
ఆయా జిల్లాలకు హెచ్చరికలు జారీ చేసింది. ప్రజలు మరింత సమాచారం కోసం వాతావరణ శాఖ వెబ్సైట్ను imdhyderabad.imd.gov.in సందర్శించాలని అధికారులు తెలిపారు.
కాగా, తమిళనాడు నుంచి కర్ణాటక, మరఠ్వాడ, విదర్భ, మధ్యప్రదేశ్ మీదుగా బీహార్ వరకు ద్రోణి విస్తరించి ఉందని అధికారులు తెలిపారు. ఈ ద్రోణి ప్రభావంతో సముద్రం నుంచి వీస్తున్న తేమ గాలులతో ఆదివారం ఏపీ కోస్తాలోని పలు ప్రాంతాల్లో వాతావరణం మారిపోయింది. మేఘాలు ఆవరించి.. పలుచోట్ల ఉరుములు, ఈదురు గాలులు, పిడుగులతో వర్షాలు పడ్డాయి.
సోమ, మంగళవారాల్లో కోస్తాలోని పలుచోట్ల ఉరుములు, పిడుగులతో, రాయలసీమలో చెదురుమదురుగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. రానున్న 48 గంటల్లో కోస్తాలోని పలు జిల్లాల్లో ఉరుములు, పిడుగులతో.. అలాగే రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో చెదురుమదురుగా వానలు పడతాయంటున్నారు.
More Stories
ఫోన్ ట్యాపింగ్ లో కేసీఆర్ కుటుంబాన్ని కాపాడుతున్న మంత్రి
ఛత్తీస్గఢ్ ఎన్కౌంటర్ మృతుల్లో ముగ్గురు తెలంగాణ వారే
రజాకార్ల గుప్పిట్లో నుండి హైదరాబాద్ విముక్తికై బిజెపికి ఓటు