కాగా, బడ్జెట్ సమావేశాల ప్రారంభం సందర్భంగా రాష్ట్రపతి ముర్ము ఉభయ సభలనుద్దేశించి ప్రసంగించిన సంగతి తెలిసిందే. దీనిపై ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ రాజ్యసభలో గురువారం ప్రసంగించారు. ఈ సందర్భంగా ప్రతిపక్ష ఎంపీలు నిరసన వ్యక్తం చేయడాన్ని కాంగ్రెస్ ఎంపీ రజనీ పాటిల్ రికార్డు చేశారు. ఆ వీడియో క్లిప్లను ట్విట్టర్లో పోస్ట్ చేశారు.
మరోవైపు రాజ్యసభ చైర్మన్ జగదీప్ దీనిపై శుక్రవారం స్పందిస్తూ తీవ్ర ఆక్షేపణ వ్యక్తం చేశారు. ఇది అనారోగ్యకరమైన చర్య అని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ఎంపీ రజనీ పాటిల్పై చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. మిగతా బడ్జెట్ సమావేశాల వరకు ఆమెను సస్పెండ్ చేసినట్లు వెల్లడించారు.
ఈ సందర్భంగా రజనీ పాటిల్ స్పందిస్తూ తాను అలాంటివేమీ చేయలేదరని, అయినా తనకు ‘ఉరిశిక్ష’ విధించారని పేర్కొన్నారు. తాను స్వాతంత్య్ర సమరయోధుల కుటుంబం నుంచి వచ్చానని, చట్టాలను ఉల్లంఘించడానికి తమ సంస్కృతి తనను అనుమతించదని చెప్పారు. రాజ్యసభలో ప్రధాని మోదీ సమాధానం ఇస్తుండగా.. అడ్డుకున్నామని, అందుకే ఆగ్రహంతో ఈ చర్య తీసుకున్నారని ఆమె ఆరోపించారు.
కాగా, కేంద్రమంత్రి పీయూష్ గోయల్ స్పందిస్తూ ప్రతిష్టాత్మకమైన సభలో పార్లమెంట్లోని సీనియర్ సభ్యులు అనధికారికంగా రికార్డు చేస్తున్న వీడియోలను సోషల్ మీడియాలు చూడాల్సి వస్తుందంటూ అసంతృప్తి వ్యక్తం చేశారు.
More Stories
కుమారస్వామి పేరు చెప్తే రూ 100 కోట్లు ఇస్తానన్న శివకుమార్
స్వాతి మలివాల్పై దాడి కేసులో బిభవ్ కుమార్ అరెస్ట్
కాంగ్రెస్కు అధికారమిస్తే రామాలయాన్ని కూల్చేస్తారు