సకల్ హిందూ సమాజ్ నిరసనలను పరిగణనలోకి తీసుకుని మలద్లోని పార్క్కు టిప్పు సుల్తాన్ పేరును తొలగించాలని ఆదేశాలు జారీ చేశామని, ఇది రైట్ గ్రూప్ విజయమని పేర్కొంటూ మంత్రి ట్వీట్ చేశారు. గత ఎంవీఏ ప్రభుత్వం ఈ గార్డెన్కు టిప్పు సుల్తాన్ పేరు పెట్టగా టిప్పు సుల్తాన్ గార్డెన్ అని కొందరు బ్యానర్ కట్టారని మంత్రి వివరించారు.
అయితే ఈ బ్యానర్పై స్ధానికులు వ్యతిరేకత వ్యక్తం చేశారని, అసలు గార్డెన్కు టిప్పు సుల్తాన్ పేరును గత ప్రభుత్వం లాంఛనంగా జోడించలేదని, దీంతో అక్రమంగా కట్టిన బ్యానర్ను తొలగించాలని తాను అధికారులను కోరానని చెప్పారు. దీనికి సంబంధించిన ప్రక్రియను పూర్తి చేస్తామని తెలిపారు.
ఈ పార్క్కు టిప్పు సుల్తాన్ పేరును ఏ ఒక్కరూ కోరుకోవడం లేదని పేర్కొన్నారు. కాగా టిప్పు సుల్తాన్ పేరు తొలగింపుపై ఎన్సీపీ మండిపడింది. పేర్లను మార్చుతూ గత ప్రభుత్వ నిర్ణయాలను తిరగతోడుతూ ఏ ప్రభుత్వం మంచి పేరు తెచ్చుకోలేదని ఆ పార్టీ ప్రతినిధి మహేష్ భరత్ తపసి పేర్కొన్నారు.

More Stories
మహిళా రిజర్వేషన్ చట్టం సవరణకు మద్దతు కోరిన మోదీ
దిగ్గజ గాయని ఆశా భోంస్లే మృతి
10 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ కావడంలో న్యాయవ్యవస్థ కీలకం