లెజెండరీ సింగర్ లతా మంగేష్కర్ కు ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం ఘనంగా నివాళి అర్పించింది. ఆమె 93వ జయంతి సందర్భంగా యోగి ప్రభుత్వం లతా మంగేష్కర్ స్మారకార్థం ‘లతా మంగేష్కర్ చౌక్ ’ను ఏర్పాటు చేసింది.
దిగ్గజ గాయకుడికి నివాళులు అర్పిస్తూ, ప్రధాని నరేంద్ర మోదీ ఒక ట్వీట్లో, “లతా దీదీ జయంతి సందర్భంగా ఆమెను స్మరించుకుంటున్నాను. నేను గుర్తుచేసుకున్నవి చాలా ఉన్నాయి. ఆమె చాలా ఆప్యాయతలను కురిపించే అసంఖ్యాక పరస్పర చర్యలు. ఈరోజు అయోధ్యలోని ఒక చౌక్కి ఆమె పేరు పెట్టడం పట్ల నేను సంతోషిస్తున్నాను. ఇది గొప్ప భారతీయ దిగ్గజాలలో ఒకరికి సముచితమైన నివాళి” అంటూ నివాళులు అర్పించారు.
ఈ కూడలి పర్యాటకులకు, సంగీత ప్రియులకు గొప్ప ఆకర్షణగా ఉంటుంది. దేశంలోనే ఇంతటి భారీ సంగీత వాయిద్యాన్ని ఏర్పాటు చేయడం ఇదే ప్రథమమని అధికారులు తెలిపారు.
రూ.7.9 కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ కూడలిని బుధవారం కేంద్ర టూరిజం మంత్రి కిషన్ రెడ్డితో కలిసి ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రారంభించారు. సరయూ నది ఒడ్డున ఉన్న ఈ కూడలిలో 14 టన్నుల బరువు, 40 అడుగుల పొడవు, 12 మీటర్ల ఎత్తున్న వీణను ఏర్పాటు చేశారు.
దేశంలోనే ఇంతటి భారీ సంగీత వాయిద్యాన్ని ఏర్పాటు చేయడం ఇదే ప్రథమమని అయోధ్య డెవలప్మెంట్ అథారిటీ కార్యదర్శి సత్యేంద్ర సింగ్ తెలిపారు. లతా మంగేష్కర్ దేశం గర్వించదగ్గ గాయకురాలని, ఆమె స్మారకార్థంగా చౌక్ ను ఏర్పాటు చేయడం చాలా ఆనందంగా ఉందని సీఎం యోగి ఆదిత్యనాథ్ తెలిపారు.
1929లో లతా మంగేష్కర్ జన్మించారు. ఈ ఏడాది ఫిబ్రవరి ఆరవ తేదీన ఆమె ముంబైలో మరణించారు. ఉత్తమ నేపథ్య గాయనిగా ఆమె మూడు సార్లు జాతీయ అవార్డు కూడా గెలిచారు. పరిచయ్, కోరా కాగజ్, లేకిన్ చిత్రాల పాటలకు అవార్డులు వచ్చాయి. యే మేరే వతన్కే లోగో లాంటి దేశభక్తి పాటను కూడా ఆమె ఆలపించారు.
More Stories
బిజెపి-ఎన్డిఎ తప్ప మరెవ్వరు ప్రభుత్వం ఏర్పాటు చేయలేరు
దుమారం రేపుతున్న బెంగాల్ గవర్నర్ పై లైంగిక ఆరోపణలు
అమేథిలో కాంగ్రెస్ ఓటమిని అంగీకరించింది