తెలుగు రాష్ట్రాల చరిత్రలోనే మొదటిసారిగా ఓ ఎమ్యెల్యే ను (రాజాసింగ్) పిడి చట్టం కింద అరెస్ట్ చేసి జైలుకు పంపి ప్రసిద్ధి కావించిన కేసీఆర్ ప్రభుత్వం తొలుత రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ చేబడుతున్న ప్రజాసంగ్రామ యాత్రకు అర్ధాంతరంగా అనుమతి రద్దు చేసి, మధ్యలో అడ్డుకోంది. దానితో మూడు రోజుల పాటు పాదయాత్రకు అంతరాయం ఏర్పడింది.
బీజేపీ నాయకులు తెలంగాణ హైకోర్టులో పోలీస్ చర్యను సవాల్ చేసి, అనుమతి పొంది శుక్రవారం నుండి యాత్రను కొనసాగిస్తుండగా, శనివారం యాత్ర ముగింపు సందర్భంగా హనుమకొండలో జరుపతలపెట్టిన బహిరంగసభకు చివరిక్షణంలో అనుమతి ఇవ్వడం లేదని గురువారం రాత్రి తెలిపారు.
హనుమకొండలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ మైదానంలో నిర్వహించ తలపెట్టిన ఈ సభకు పోలీసుల నుండి తగు అనుమతి రాకపోవడంతో ఈ సభకు అనుమతిని రద్దు చేస్తున్నట్లు ఆ కళాశాల ప్రిన్సిపాల్ తెలిపారు. ఆ మేరకు గురువారం సాయంత్రం వరంగల్ జిల్లా బీజేపీ అధ్యక్షురాలు పద్మారెడ్డికి లేఖ రాశారు. సభ కోసం బీజేపీ చెల్లించిన రూ.5 లక్షలను తిరిగి ఇవ్వనున్నట్లు తెలిపారు.
మరోవంక, మూడు రోజుల క్రితం పాదయాత్రను ఆపిన చోట నుండే సంజయ్ తన పాదయాత్రను తిరిగి ప్రారంభించారు. ఉదయం 8 గంటలకు స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గం పామునూర్ నుంచి ప్రజా సంగ్రామ యాత్ర ప్రారంచించారు.
స్టేషన్ ఘనపురం నియోజకవర్గం, ఉప్పుగల్ సమీపంలోని పాదయాత్ర శిబిరం నుంచి ప్రారంభించారు. ఉప్పుగల్, కూనూరు, గర్మేపల్లి మీదుగా నాగాపురం వరకు కొనసాజి, రాత్రికి నాగాపురం సమీపంలో బస చేస్తారు. కాకపోతే పాదయాత్ర రూట్ మ్యాప్ లో కొన్ని మార్పులు చేర్పులు చేశారు. శనివారం ఉదయం వరంగల్ భద్రకాళి గుడిలో అమ్మవారిని సంజయ్ దర్శించుకోనున్నారు.
More Stories
కేజ్రీవాల్ పిఎ చెంపపై, కడుపులో కొట్టి, కాలుతో తన్నాడు
రక్షణ, వాణిజ్య రంగాల్లో చైనా, రష్యా మరింత సహకారం
జూన్ 4 తర్వాత కూటమి విచ్ఛిన్నం ఖాయం