
కేంద్ర పాలిత ప్రాంతమైన జమ్మూకశ్మీర్లో పోలీసులు, ఆర్మీ సిబ్బందిపై దాడులు ఆగడం లేదు. ఉగ్రవాదులు కొన్నిసార్లు పెట్రోలింగ్లో ఉన్న భద్రతా బలగాలను లక్ష్యంగా చేసుకుంటున్నారు. ఉగ్రవాదులు పోలీసులు, భద్రతా దళాల శిబిరాలపై దాడులు చేస్తున్నారు. జమ్మూ కశ్మీర్లో ఆర్మీ సిబ్బందిపై దాడులకు తెగబడుతున్న ఓ వీడియో అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.
దేశంలో హిజాబ్పై వివాదం నడుస్తుండగా ఈ వ్యవహారం సుప్రీంకోర్టుకు చేరిన తరుణంలో జమ్మూకశ్మీర్లో బురఖా ధరించిన ఓ మహిళ సీఆర్పీఎఫ్ బంకుపై పెట్రోల్ బాంబు విసిరి అక్కడి నుంచి పారిపోయిన ఘటన వెలుగుచూసింది.
సీఆర్పీఎఫ్ బంకర్పై మహిళ పెట్రోల్ బాంబు విసిరిన సీసీటీవీ ఫుటేజీ కూడా బయటపడింది. సాధారణ రోజులాగే ప్రజలు రోడ్డుపై నడుస్తున్నట్లు వీడియోలో కనిపిస్తోంది. ఇంతలో బురఖా ధరించిన ఓ మహిళ అటుగా వెళుతోంది. బురఖా మహిళ చేతిలో బ్యాగ్ ఉంది.
సీఆర్పీఎఫ్ బంకరును చూసిన ఆ మహిళ తన బ్యాగ్లో ఉన్న పెట్రోల్ బాంబును తీసి బంకర్పై విసిరి అక్కడి నుంచి పారిపోయింది.బంకర్పై దాడి జరిగిన తర్వాత అక్కడ మంటలు చెలరేగడంతో భద్రతా సిబ్బంది మంటలను నీటితో చల్లార్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు వీడియోలో కనిపించింది. బంకర్పై మహిళ చేసిన పెట్రోల్ బాంబు దాడిలో ఏ జవాన్కు ఎలాంటి గాయాలు కాకపోవడం ఉపశమనం కలిగించింది.
More Stories
దేశంలో 14 శాతం పెరిగిన వరకట్నం కేసులు
బీహార్ లో తుది ఓటరు జాబితాను విడుదల చేసిన ఈసీ
క్యాన్సర్ పరిశోధనలో భారతీయ కుత్రిమ మేధ