వ్యాక్సిన్లు- కొవావాక్స్, కార్బోవాక్స్, యాంటీ వైరల్ డ్రగ్ ‘మోల్నూపిరావిర్’లను అత్యవసర వినియోగానికి అనుమతించినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ మన్షుక్ మాండవీయ ప్రకటించారు. ఈ తాజా ఆమోదంతో దేశంలో అత్యవసర వినియోగానికి ఆమోదం లభించిన కోవిడ్ వ్యాక్సిన్ల సంఖ్య ఎనిమిదికి చేరింది.
సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (పుణె) తయారుచేసిన ‘కొవొవాక్స్’కు, బయోలాజికల్-ఈ తయారు చేసిన కార్బివాక్స్కు అనుమతులు మంజూరు చేయాలని, కేంద్ర ఔషధ ప్రమాణాల నియంత్రణ సంస్థ (సిడిఎస్సిఒ) నిపుణుల కమిటీ సిఫార్సు చేసింది. ఆ సిఫార్సుల మేరకు కేంద్రం వాటి వినియోగానికి అనుమతి ఇచ్చింది. అయితే ఎమర్జెన్సీ పరిస్థితుల్లో వీటి వినియోగానికి ఆమోదం లభించిందని మంత్రి డాక్టర్ మన్షుక్ మాండవీయ చెప్పారు.
”కంగ్రాట్యులేషన్స్ ఇండియా ఫ్లాగ్ ఆఫ్ ఇండియా. కరోనాపై పోరాటాన్ని మరింత కట్టుదిట్టం చేస్తూ ఆరోగ్య, కుటుంబ మంత్రిత్వ శాఖ పరిధిలోని సిడిఎస్సిఎ ఒకే రోజు మూడింటికి (వ్యాక్సిన్, పిల్) అనుమతించింది” అని ఆ ట్వీట్లో మాండవీయ పేర్కొన్నారు.
అమెరికాకు చెందిన నొవావాక్స్ నుంచి టీకా సాంకేతికతను పొందిన ఎస్ఐఐ కొవొవాక్స్ కొత్త టీకాను ఉత్పత్తి చేసింది. అత్యవసర వినియోగం నిమిత్తం ఈ ఏడాది అక్టోబరులోనే డ్రగ్ కంట్రోల్ జనరల్ ఆఫ్ ఇండియాకు దరఖాస్తు చేసింది. బ్రిటన్, అమెరికాల్లో ఈ టీకాపై చేపట్టిన 2, 3 దశల క్లినికల్ పరీక్షల ఫలితాలకు సంబంధించిన డేటాను జతచేసింది.
ఈ క్రమంలోనే సిడిఎస్సిఒ నిపుణుల బఅందం దీన్ని పరిశీలించి, అత్యవసర వినియోగానికి అనుమతులు మంజూరు చేయవచ్చని సోమవారం సిఫార్సు చేసింది. దీంతోపాటు కొన్ని పరిమితులకు లోబడి కార్బివాక్స్కు అనుమతినిచ్చింది.
మంత్రి డాక్టర్ మన్షుక్ మాండవీయ మాట్లాడుతూ కరోనా వ్యాధికి ‘మోల్నుపిరవిర్’ ఔషధం అత్యవసర వినియోగానికి భారత ప్రభుత్వం అనుమతించిందని పేర్కొన్నారు. మెర్క్, రిడ్జ్బ్యాక్ బయోథెరప్యూటిక్స్ సంయుక్తంగా ఈ యాంటీ-వైరల్ ఔషధాన్ని అభివృద్ధి చేశాయని తెలిపారు.
దీంతో మరిన్ని ఆంక్షలు అమల్లోకి రానున్నాయి. ఇప్పటికే అక్కడ రాత్రి కర్ఫ్యూ అమల్లో ఉన్న సంగతి తెలిసిందే. ఈ ఎల్లో ఎలర్ట్ నేపథ్యంలో సినిమా ధియేటర్లు, జిమ్స్ మూతపడతున్నాయి. మాల్స్, షాపులు.. సరి, బేసి సంఖ్యల ఆధారంగా తెరుచుకోనున్నాయి.
ఎల్లో అలర్ట్ నిబంధనలు
- సరి, బేసి సంఖ్యల ఆధారంగా మాల్స్, షాపులు.. ఉదయం 10 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు తెరుచుకోనున్నాయి.
- ప్రైవేటు సంస్థల్లో 50 శాతం సిబ్బందితో మాత్రమే కార్యకలాపాలు కొనసాగించాల్సి ఉంటుంది.
- వివాహ వేడుకలకు కేవలం 20 మంది మాత్రమే అనుమతి
- మూత పడనున్న సినిమా ధియేటర్లు, మల్లిప్లెక్స్లు, జిమ్లు
- విద్యాసంస్థలకు తాళం
- రాత్రి 10 తర్వాత రెస్టారెంట్లు, బార్లు మూత.. తెరిచిన సమయంలో కెపాసిటీలో సగం మందికే అనుమతి
- ఢిల్లీ మెట్రో కూడా సగం సామర్థ్యతతోనే కార్యకలాపాలు సాగించనుంది
- ఆన్లైన్ డెలివరీ కొనసాగింపు
- రాత్రి 10 గంటల నుండి ఉదయం 5 గంటల వరకు నైట్ కర్ఫ్యూ
- సెలూన్, బార్బర్ షాపులు, పార్లర్లకు తాళం
- స్పా, వెల్నెస్ క్లినిక్స్ కూడా
- రాజకీయ, మతపరమైన, పండుగులకు సంబంధించిన సమూహాలకు అనుమతి నిరాకరణ
More Stories
బాల్యం నుండి స్వయంసేవక్ నే… తిరిగి ఆర్ఎస్ఎస్ కోసం పనిచేస్తా!
ఇదో దశలో 60 శాతం దాటిన పోలింగ్
నలుగురు ఐఎస్ ఉగ్రవాదులు అహ్మదాబాద్ లో పట్టివేత