ఎస్బీఐ కస్టమర్ ఒకరికి ఈ బ్రాంచ్పై అనుమానం వచ్చి స్థానిక బ్రాంచ్ మేనేజర్కు సమాచారం ఇచ్చారు. సదరు మేనేజర్ ఈ సమాచారాన్ని జోనల్ ఆఫీసుకు తెలియజేశారు. ఎస్బీఐకు సంబంధించి పన్రూటీలో కేవలం 2 బ్రాంచులకు మాత్రమే అనుమతులున్నాయని మూడోది బ్రాంచ్ నకిలీదని జోనల్ అధికారులు నిర్ధారించారు.
నకిలీ బ్రాంచ్ను సందర్శంచి అందులో సోదాలు నిర్వహించారు. అదృష్టవశాత్తు ఈ బ్రాంచ్ నుంచి ఎలాంటి లావాదేవీలు జరగకపోవడంతో అధికారులు ఊపిరిపీల్చుకున్నారు. కస్టమర్లకు ఏమాత్రం అనుమానం రాకుండా వ్యవస్థలు, మౌలిక సదుపాయాల రూపకల్పన చూసి అధికారులు విస్తుపోయారు. వెంటనే ఈ విషయాన్ని స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చారు.
సమాచారం అందుకున్న పన్రూటీ పోలీసులు ఈ ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. కేసును నమోదు చేసి నిందితులను కోర్టులో హాజరు పరుస్తామని పోలీసు ఇన్స్పెక్టర్ అంబేద్కర్ తెలిపారు.

More Stories
ఉచిత పథకాల వల్ల రాష్ట్రాల అభివృద్ధికి విఘాతం
రూ.70,000 కోట్ల పన్నులు ఎగ్గొట్టిన రెస్టారెంట్లు
అమెరికా-భారత్ మధ్య ‘సముద్ర కేబుల్ మార్గం’