
ఎస్బీఐ కస్టమర్ ఒకరికి ఈ బ్రాంచ్పై అనుమానం వచ్చి స్థానిక బ్రాంచ్ మేనేజర్కు సమాచారం ఇచ్చారు. సదరు మేనేజర్ ఈ సమాచారాన్ని జోనల్ ఆఫీసుకు తెలియజేశారు. ఎస్బీఐకు సంబంధించి పన్రూటీలో కేవలం 2 బ్రాంచులకు మాత్రమే అనుమతులున్నాయని మూడోది బ్రాంచ్ నకిలీదని జోనల్ అధికారులు నిర్ధారించారు.
నకిలీ బ్రాంచ్ను సందర్శంచి అందులో సోదాలు నిర్వహించారు. అదృష్టవశాత్తు ఈ బ్రాంచ్ నుంచి ఎలాంటి లావాదేవీలు జరగకపోవడంతో అధికారులు ఊపిరిపీల్చుకున్నారు. కస్టమర్లకు ఏమాత్రం అనుమానం రాకుండా వ్యవస్థలు, మౌలిక సదుపాయాల రూపకల్పన చూసి అధికారులు విస్తుపోయారు. వెంటనే ఈ విషయాన్ని స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చారు.
సమాచారం అందుకున్న పన్రూటీ పోలీసులు ఈ ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. కేసును నమోదు చేసి నిందితులను కోర్టులో హాజరు పరుస్తామని పోలీసు ఇన్స్పెక్టర్ అంబేద్కర్ తెలిపారు.
More Stories
మరోసారి అత్యంత ధనవంతుడిగా అంబానీ
అంతర్జాతీయంగా భారీగా తగ్గుతున్న ముడి చమురు ధరలు
ఏటీఎంలలో రూ. 2,000 నోట్లపై ప్రభుత్వ ప్రమేయం లేదు