ఇంతలో, కాంగ్రెస్ నాయకత్వంలోని యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ (యుడిఎఫ్) విశ్వవిద్యాలయాలలో జోక్యం చేసుకున్నందుకు ప్రభుత్వాన్ని నిందించింది. రాష్ట్రంలోని యూనివర్సిటీలపై ఎల్డీఎఫ్ ప్రభుత్వం కమ్యూనిజాన్ని బలవంతంగా ప్రయోగించిందని, ఇక్కడ రాజకీయ జోక్యంతో గవర్నర్ కూడా విసిగిపోయారని కాంగ్రెస్ ఎంపీ కె. మురళీధరన్ ధ్వజమెత్తారు.
ఐయుఎంఎల్ నాయకుడు ఎం కె మునీర్ కూడా గవర్నర్కు మద్దతుగా నిలిచారు. ‘‘కేరళ గవర్నర్తో సంబంధం లేకుండా నియామకాలు చేబడుతూ ఆయనను ప్రభుత్వం రబ్బర్ స్టాంప్గా కుదించింది’’ అని మునీర్ మండిపడ్డారు.
రాజకీయ జోక్యంపై అసహనం వ్యక్తం చేస్తూ, యూనివర్సిటీల ఛాన్సలర్గా ఉన్న గవర్నర్, తాను ఛాన్సలర్ పదవిని చేపట్టేందుకు వీలుగా యూనివర్సిటీల చట్టాలను సవరించాలని కోరుతూ ముఖ్యమంత్రి పినరయి విజయన్కు వ్రాసిన లేఖలో సూచించారు.
ఇటీవల కన్నూర్ యూనివర్శిటీ వైస్ ఛాన్సలర్గా ప్రొఫెసర్ గోపీనాథ్ రవీంద్రన్ను మరో నాలుగేళ్ల పాటు తిరిగి నియమించడం, యూనివర్సిటీ చట్టానికి సవరణను రాష్ట్ర అసెంబ్లీ ఆమోదించడంపై గవర్నర్ అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. ఈ సవరణ ద్వారా యూనివర్సిటీ అప్పిలేట్ ట్రిబ్యునల్ను నియమించే ఛాన్సలర్ గా గవర్నర్ కు గల అధికారాన్ని తొలగించారు.
ట్రిబ్యునల్ నియామకంలో హైకోర్టును సంప్రదించేందుకు ఛాన్సలర్కు అధికారమిచ్చే క్లాజును కూడా తొలగించడంపై గవర్నర్ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. శంకరాచార్య సంస్కృత యూనివర్శిటీ వైస్ ఛాన్సలర్గా ఒకే ఒక్క పేరును మాత్రమే సిఫార్సు చేయడాన్ని ఖాన్ నిరసించినట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఈ అంశంపై రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించలేదు.
More Stories
అమిత్ షాకు తప్పిన హెలికాప్టర్ ప్రమాదం
నామినేషన్ ఉపసంహరించుకున్న ఇండోర్ కాంగ్రెస్ అభ్యర్థి
హైదరాబాద్ కేంద్ర పాలిత ప్రాంతం అంటూ కేటీఆర్ కొత్త అస్త్రం