చైనా డెవలప్మెంట్ బ్యాంక్-శ్రీలంక ప్రభుత్వం మధ్య ఈ ఒప్పందం శ్రీలంక అభ్యర్థన మేరకు జరిగినట్లు తెలుస్తున్నది. చైనా రాయబార కార్యాలయం వెలువరించిన ప్రకటన ప్రకారం ఈ ఒప్పందం శ్రీలంకకు కరోనా వైరస్ను ఎదుర్కొనేందుకు, అలాగే, ఆర్థిక పునరుద్ధరణ, ఆర్థిక స్థిరత్వం, మెరుగైన జీవనోపాధికి సహాయపడుతుంది.
రెండు దేశాల మధ్య జరిగిన ఈ ఒప్పందంలో చైనా పాత రుణ మద్దతులో రూ.11,877 కోట్లు కూడా ఉన్నాయి. శ్రీలంక ఇప్పటికే రెండు విడతలుగా రూ.7,423 కోట్ల రుణ సాయాన్ని పొందింది. మొదటి విడతగా 2020 మార్చి లో, రెండో విడతగా 2021 ఏప్రిల్ నెలలో శ్రీలంక అందుకున్నది. పూర్తిగా పర్యాటకంపై ఆధారపడిన శ్రీలంక కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా గణనీయమైన నష్టాలను చవిచూసింది.
హంబన్తోట పోర్టు కోసం శ్రీలంక ప్రభుత్వం చైనా నుంచి తీసుకున్న 8 బిలియన్ డాలర్ల రుణాన్ని తిరిగి చెల్లించలేకపోయింది. దాంతో 2017 లో హంబన్తోట పోర్టును చైనా కంపెనీకి 99 సంవత్సరాల లీజుకు ఇవ్వాల్సి వచ్చింది. ప్రపంచంలో అత్యంత రద్దీగా ఉండే ఓడరేవుల్లో హంబన్తోట పోర్టు ఒకటి. గత అనేక సంవత్సరాలుగా చైనా అభివృద్ధి ప్రాజెక్ట్ కోసం శ్రీలంకకు వేల కోట్ల రుణాలు ఇచ్చింది. శ్రీలంక ప్రభుత్వం 2025 నాటికి రూ.33 వేల కోట్ల విదేశీ రుణాన్ని తిరిగి చెల్లించాల్సి ఉన్నది.
ఈ ఒప్పందం దేశ సార్వభౌమత్వాన్ని చైనాకు తాకట్టు పెట్టడంకు దారితీసే అవకాశాలున్నట్లు దేశంలో విమర్శలు చెలరేగుతున్నాయి. హంబాంటోటా ఎంపీ, మాజీ శ్రీలంక అధ్యక్షుడు మహీంద రాజపక్సే కుమారుడు నామల్ రాజపక్సేపై మొదటి ఈ ఒప్పందంపై సంతకం చేసినప్పుడు, “ప్రభుత్వం జాతీయ ఆస్తులతో భౌగోళిక రాజకీయాలను ఆడుతోందా?” అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
బీజింగ్ దృష్టిలో హంబన్తోట ప్రాజెక్ట్ అనేది “వన్ బెల్ట్ వన్ రోడ్” ప్రాజెక్ట్ లో ప్రధాన అంశం కానున్నది. ఇది చైనా, ఆసియా, మధ్య ప్రాచ్యం, ఆఫ్రికా, ఐరోపాలోని 60 కి పైగా దేశాల మధ్య కొత్త సిల్క్ రోడ్ని నిర్మించడానికి లక్ష్యంగా పెట్టుకుంది. కాగా, 19 వ శతాబ్దంలో హాంకాంగ్పై బ్రిటన్ నియంత్రణ ఇచ్చినట్లుగా, శ్రీలంక అంగీకరించిన లీజు వ్యవధిని గమనిస్తే, బీజింగ్ తన ప్రాంతీయ రాజకీయ శక్తిని పెంచుకోవడానికి ఇలాంటి ప్రాజెక్టులను ఉపయోగిస్తుందని అంతర్జాతీయంగా పలువురు ఆరోపిస్తున్నారు.
విదేశాంగ విధాన థింక్-ట్యాంక్ కార్నెగీకి చెందిన కాన్స్టాంటినో జేవియర్
ఈ ప్రాంతంలో చైనా చేస్తున్న పెద్ద వ్యూహాత్మక అడుగులో ఇదొక్క భాగం అని పేర్కొన్నారు. “బీజింగ్ సాధారణంగా ఒక స్థానిక భాగస్వామిని కనుగొంటుంది, స్థానిక భాగస్వామి దీర్ఘకాలంలో తమ దేశానికి హాని కలిగించే పెట్టుబడి ప్రణాళికలను ఆమోదించేలా చేస్తుంది. ఆపై ఆ ప్రాజెక్టును పూర్తిగా పొందడానికి లేదా ఆ దేశంలో రాజకీయ పరపతి పొందడానికి అప్పులను ఉపయోగిస్తుంది” అంటూ చైనా దుష్ట విధానాన్ని ఎండగట్టాడు.హంబన్తోటలో బీజింగ్ ప్రణాళికల గురించి భారత ప్రభుత్వం చాలా ఆందోళన చెందుతోంది. అక్కడకు సమీపంలో విమానాశ్రయాన్ని నిర్వహించడానికి శ్రీలంకతో చర్చలు ప్రారంభించింది. అయితే, ఇటీవలి నెలల్లో, వన్ రోడ్ బ్యానర్ కింద ప్రాజెక్టులను నిర్మించడానికి నిర్దేశించబడిన నిబంధనలపై చైనా భాగస్వాములు అప్రమత్తంగా మారే సంకేతాలు కనిపిస్తున్నాయి.
పాకిస్తాన్, నేపా, మయన్మార్ ఇటీవల చైనా కంపెనీల కుట్రలను గమనించే, వారు 20 బిలియన్ డాలర్లతో నిర్మించ తలపెట్టిన ప్రధాన జలవిద్యుత్ ప్రాజెక్టులను రద్దు చేశాయి లేదా పక్కన పెట్టాయి.
More Stories
స్వాతి మలివాల్పై దాడి గురించి కేజ్రీవాల్ దాటవేత
ఉద్యోగం కోల్పోయిన హెచ్-1బీ వీసాదారులకు ఊరట
‘అధిక సంతానం’ ముస్లింల గురించి కాదు.. పేదల గురించి