
ప్రవీణ్ కుమార్పై ఇటీవల పలు వివాదాలు చుట్టుముట్టాయి. ఆయన గురుకులాల కార్యదర్శి పదవికి రాజీనామా చేయాలని పలువురు డిమాండ్ చేశారు. తొమ్మిది సంవత్సరాల నుంచి స్వేరోస్ కార్యదర్శిగా ప్రవీణ్కుమార్ సేవలు అందించారు. అనివార్య కారణాల వల్ల రాజీనామా చేస్తున్నట్లు తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఈ మెయిల్ పంపారు.
ఈ నిర్ణయం బాధ కలిగించినా ఎట్టకేలకు ఎలాంటి పరిమితులు లేకుండా, తన మనసుకు నచ్చిన పనులు నచ్చిన రీతిలో చేయబోతున్నట్లు ప్రకటించారు. పదవీ విరమణ అనంతరం పీడిత వర్గాలకు అండగా ఉంటానని పేర్కొంటూ రాజకీయ కార్యక్రమాలు చేబట్టబోతున్నట్లు సంకేతం ఇచ్చారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల్లో స్వేరోల కార్యకలాపాలపై విచారణ జరిపి నివేదిక సమర్పించాల్సిందిగా జాతీయ బాలల హక్కుల కమిషన్ గత మార్చ్ లో రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. తెలంగాణ ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న గురుకులాల్లో స్వేరోల పేరిట ప్రయివేట్ వ్యక్తుల పెత్తనంపై చాలా కాలంగా చర్చ జరుగుతోంది.
గురుకులాల సొసైటీ కార్యదర్శిగా ఉన్న ఐపీఎస్ అధికారి ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ ఏర్పాటు చేసిన ‘స్వేరోస్’ అనే ప్రయివేట్ సంస్థ ఆధ్వర్యంలో టెండర్ల విషయంలో అక్రమాలే కాకుండా అక్కడ విద్యనభ్యసిస్తున్న పిల్లలపై అన్యమత భవనాలు బలవంతంగా రుద్దుతున్న విషయం కూడా చాలా కాలంగా కూడా ప్రచారంలో ఉంది. దీనిపై లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరమ్ జాతీయ బాలల హక్కుల కమిషన్ ను ఆశ్రయించింది.
ఈ పాఠశాలలకు కార్యదర్శిగా ఐ.పి.ఎస్ అధికారి ప్రవీణ్కుమార్ గత 7సంవత్సరాలుగా కొనసాగుతుండటం, గురుకులాల కార్యదర్శిగా ఉంటూనే ప్రైవేటుగా స్వేరొస్ అనే ఒక సంస్థను ఏర్పాటు చేయడం, గురుకులాల అంతర్గత విషయాల్లో స్వేరోలు కలుగజేసుకుంటుండటం, పాఠశాలల్లో జాతీయగీతం స్థానంలో ప్రత్యేకంగా రూపొందించిన ‘స్వేరో గీతం’ పిల్లలతో ఆలాపన చేయడం వంటి విషయాలను లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరమ్ తమ ఫిర్యాదులో ప్రస్తావించింది.
More Stories
మాలవీయ మిషన్ పేద విద్యార్థులకు ఆర్థిక సహాయం
స్థానిక సంస్థల ఎన్నికల్లో బిజెపి అభ్యర్థుల ఎంపిక ప్రారంభం
తెలంగాణ బతుకమ్మకు రెండు గిన్నిస్ రికార్డులు