సెకండ్ వేవ్ తో కరోనా వైరస్ విజృంభించడంతో వైరస్ సోకిన బాధితులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆస్పత్రిలో ట్రీట్ మెంట్ తీసుకునేందుకు ఆర్ధికంగా ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా ప్రైవేట్ ఆస్పత్రుల్లో చికిత్సకు ఫీజులు చెల్లించలేక నానా ఇక్కట్లు పడుతున్నారు.
ఈ క్రమంలోనే గోవా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని కరోనా ట్రీట్మెంట్ కు కేటాయించిన 21 ప్రైవేటు ఆస్పత్రులను ప్రభుత్వ అధీనంలోకి తీసుకుంటున్నట్లు ప్రకటించింది. సోమవారం నుంచి ఈ ఆస్పత్రులన్నీ ప్రభుత్వ అధీనంలో పనిచేస్తాయని గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ ప్రకటించారు.
ఈ నిర్ణయం వల్లన గోవా ప్రభుత్వ వైద్య కళాశాల, ఆసుపత్రిపై వత్తిడి తగ్గుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. గత నాలుగైదు రోజులలో 75 మంది రోగులు చికిత్స సందర్భంగా చనిపోవడంతో తీవ్ర ఆందోళనలు చెలరేగాయి.
ఈ ఆస్పత్రుల్లో కొవిడ్ బాధితుల వైద్యానికి అయ్యే ఖర్చు ప్రభుత్వమే చెల్లిస్తుందని చెప్పారు. ఆయా ఆస్పత్రుల్లో సిబ్బంది ఎప్పటిలాగే కొనసాగుతారని, నియంత్రణ మాత్రమే ప్రభుత్వానిదని చెప్పారు. అంతేకాదు ప్రతి ఆస్పత్రిని ఒక ప్రభుత్వ అధికారి పర్యవేక్షిస్తారని చెప్పారు.
కరోనా పేషెంట్ల కోసం 50 శాతం పడకలు కేటాయించాలన్న రూల్ అమలు చేయని కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రమోద్ సావంత్ తెలిపారు. ఈ ఆసుపత్రులలో చికిత్సకు దీనదయాల్ స్వస్త్య సేవ యోజన పధకం క్రింద ఖర్చులు భరిస్తామని పేర్కొన్నారు.
More Stories
విపక్షాలకు పాకిస్థాన్పై ప్రేమ? భారత సైన్యంపై ద్వేషం!
నేడు 92 స్థానాల్లో మూడో దశ ఎన్నికల పోలింగ్
కేజ్రీవాల్పై ఎన్ఐఏ దర్యాప్తునకు ఎల్జీ సక్సేనా సిఫార్సు