ఆవు పెండతో తయారైన పెయింట్ను కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ పరిచయం చేసి, దీనికి వేదిక్ పెయింట్ అని పేరు పెట్టారు. ట్విటర్ ద్వారా ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. అతి త్వరలోనే ఈ వేదిక్ పెయింట్ను లాంచ్ చేయనున్నట్లు ఆయన ప్రకటించారు.
“గ్రామీణప్రాంత ఆర్థిక వ్యవస్థను మరింత బలోపేతం చేయడానికి, రైతులకు అదనపు ఆదాయం సమకూర్చడానికి అతి త్వరలోనే ఆవు పెండతో తయారు చేసిన ఈ వేదిక్ పెయింట్ను లాంచ్ చేయబోతున్నాం. ఖాదీ, గ్రామీణ పరిశ్రమల కమిషన్ ద్వారా ఈ పెయింట్ తయారవుతోంది” అని గడ్కరీ ట్వీట్ చేశారు.
ఈ పెయింట్ డిస్టెంబర్, ఎమల్షన్ రూపాల్లో అందుబాటులో ఉంటుందని, కేవలం నాలుగు గంటల్లో ఆరిపోతుందని చెప్పారు. పర్యావరణ హితమైన ఈ పెయింట్ విష రహిత, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ లక్షణాలు కలిగి ఉంటుంది.
ఈ వేదిక్ పెయింట్ వల్ల గ్రామీణ ప్రాంతాల్లోని పాడి రైతులు అదనంగా ఏడాదికి రూ.55 వేలు సంపాదిస్తారని గడ్కరీ అంచనా వేశారు.

More Stories
రూ.20,804 కోట్లతో 8 మల్టీట్రాకింగ్ రైల్వే ప్రాజెక్టులు
కర్నాటక మంత్రి సతీశ్, ఎంపీ ప్రియాంకా ఇంట్లో ఈడీ సోదాలు
పొదుపు కంటే వేగంగా పెరుగుతున్న మధ్య తరగతి కుటుంబాల అప్పులు