న్యూఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ (జేఎన్యూ)లో లైంగిక వేధింపుల ఆరోపణలు సంచలనం రేపుతున్నాయి. 11 మంది విద్యార్ధినిలు ఒక ప్రొఫెసర్ తమను లైంగికంగా వేధించారని ఆరోపిస్తూ యూనివర్సిటీలోని ‘అంతర్గత ఫిర్యాదుల కమిటీ’ (ఐసిసి)కి ఫిర్యాదు చేశారు. మే మొదటి వారంలో జరిగిన ‘వైవా’ (మౌఖిక) పరీక్షల సమయంలో సదరు ప్రొఫెసర్ లైంగికపరమైన అర్థాలు వచ్చేలా అసభ్యకర వ్యాఖ్యలు చేశారని ఆరోపణలు వచ్చాయి.
మే రెండవ వారంలో, ఒక విద్యార్థిని కేవలం విద్యార్థులు మాత్రమే ఉన్న ఒక అనధికారిక వాట్సాప్ గ్రూప్లో తన అనుభవాన్ని పంచుకోగా, అది చూసి మరికొందరు విద్యార్థులు కూడా ఇలాంటి ఆరోపణలతో ముందుకు వచ్చారు.
“మే మొదటి వారంలో జరిగిన వైవా పరీక్షల సమయంలో, ఆ ప్రొఫెసర్ లైంగికపరమైన అర్థాలు వచ్చేలా అసభ్యకర వ్యాఖ్యలు చేశారు. మే రెండవ వారంలో, ఒక విద్యార్థిని కేవలం విద్యార్థులు మాత్రమే ఉన్న ఒక అనధికారిక వాట్సాప్ గ్రూప్లో తన అనుభవాన్ని పంచుకోగా, అది చూసి మరికొందరు విద్యార్థులు కూడా ఇలాంటి ఆరోపణలతో ముందుకు వచ్చారు. విద్యార్థులు తన లైంగిక ప్రతిపాదనలకు అంగీకరిస్తే అదనపు మార్కులు ఇస్తానని సూచించేలా ఆయన వ్యాఖ్యలు చేశారు,” అని సంబంధిత వర్గాలు తెలిపాయి.
“ఆ తర్వాత అదే నెలలో ఐసిసికి ఫిర్యాదు చేశారు. దీనిని అనుసరించి పలువురు విద్యార్థులను వారి వాంగ్మూలాలు ఇవ్వడానికి పిలిచారు,” అని ఆ వర్గాలు పేర్కొన్నాయి. యూనివర్సిటీలో సీనియర్ అధ్యాపకుడికి సంబంధించిన గత లైంగిక వేధింపుల కేసు నేపథ్యంలోనే ఈ తాజా ఫిర్యాదు వచ్చింది. గత ఏడాది ఏప్రిల్లో, లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న ఒక అధ్యాపకుడితో సహా నలుగురు సిబ్బందిని జేఎన్యూ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ తొలగించింది. మిగిలిన ముగ్గురిని అవినీతి కేసులో తొలగించారు.
లైంగిక వేధింపుల కేసులో తొలగించిన అధ్యాపకుడు జేఎన్యూలోని ‘స్కూల్ ఆఫ్ ఇంటర్నేషనల్ స్టడీస్’కు చెందిన సీనియర్ ప్రొఫెసర్ స్వరన్ సింగ్ అని అప్పట్లో మీడియాలో కధనాలు వచ్చాయి.జపాన్ రాయబార కార్యాలయానికి చెందిన ఒక జపనీస్ అధికారిణిని లైంగికంగా వేధించారనే ఆరోపణలపై ఆయనను తొలగించినట్లు అప్పట్లో ఈ విషయం తెలిసిన ఒక అధికారి తెలిపారు.
విద్యాపరమైన కార్యక్రమాల కోసం ప్రొఫెసర్లతో సమన్వయం చేసుకునే సదరు జపనీస్ అధికారిణి, సింగ్తో జరిపిన చివరి సమావేశం తర్వాత ఫిర్యాదు చేశారని ఆ అధికారి చెప్పారు. “సింగ్కు వ్యతిరేకంగా స్పష్టమైన ఆధారాలు ఉన్నాయి. అందుకే ఆయనను తొలగించారు,” అని చెప్పిన ఆ అధికారి, గతంలో కూడా ఆయనపై అనేక ఫిర్యాదులు వచ్చాయని పేర్కొన్నారు.

More Stories
ఐరాస మ్యాప్లో కశ్మీర్, లద్ధాఖ్ భారత్ మ్యాప్ ప్రకారమే ఉండాలి
పర్వతారోహకులతో కరిగిపోతున్న హిమాలయాలు
నవంబర్ 27 బాల్య వివాహ వ్యతిరేక దినంగా ప్రకటించిన ఐరాస