ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో గెలుపొందిన జో బైడెన్లు వారికి అనుకూలమైన సమయంలో మాట్లాడుకుంటారని విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. భారత్- అమెరికా సంబంధాలు అమెరికాలో ద్వైపాక్షిక మద్దతును పొందుతాయని పునరుద్ఘాటించింది.
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ప్రస్తుత అధ్యక్షుడు ట్రంప్పై డెమొక్రటిక్ అభ్యర్థి జో బైడెన్ గెలిచిన కొన్ని రోజులకు భారత్ ఈ ప్రకటన చేసింది. జో బైడెన్ను ట్విట్టర్ ద్వారా ప్రధాని మోడీ అభినందించారంటూ, అదేవిధంగా భారత్-అమెరికా సంబంధాల బలోపేతానికి కట్టుబడి ఉన్నామని బైడెన్ పేర్కొన్నట్లు విదేశాంగ శాఖ అధికార ప్రతినిథి శ్రీవాత్సవ గుర్తు చేశారు .
భారత్- అమెరికా సంబంధాలను మరింత ఎత్తుకు తీసుకువెళ్లేందుకు బైడెన్తో కలిసి పనిచేసేందుకు ఎదురుచూస్తున్నట్లు మోదీ సైతం అభిప్రాయాన్ని వ్యక్త పరిచారని ఓ సమావేశంలో శ్రీవాత్సవ తెలిపారు.
ఇరు దేశాధినేతలు ఎప్పుడు సంభాషించుకుంటారన్న ప్రశ్నకు… వారిద్దరికీ తీరిక దొరికిన సమయంలోనని తెలియజేశారు. అమెరికా-భారత్ మధ్య సంబంధాలు చాలా బలంగా ఉన్నాయని, ఇరు దేశాల మధ్య ఉన్న సమగ్ర ప్రపంచ వ్యూహాత్మక భాగస్వామ్యానికి అమెరికాలో ద్వైపాక్షిక మద్దతు ఉందని చెప్పారు.
More Stories
బ్రిటన్ పార్లమెంట్ కు జులై 4న ముందస్తు ఎన్నికలు
భారత సంతతి శాస్త్రవేత్త కులకర్ణికి ప్రతిష్ఠాత్మక షా ప్రైజ్
ఇరాన్ అధ్యక్షుడి మరణంతో సంబరాలు!