పశ్చిమ బెంగాల్ బీజేపీ అధ్యక్షుడు దిలీప్ ఘోష్ కాన్వాయ్ పై గురువారం రాళ్ల దాడి జరిగింది. ఉత్తర బెంగాల్లోని అలీపూర్ దగ్గర గుర్తు తెలియని వ్యక్తులు ఆయన కాన్వాయ్ పై రాళ్ల దాడికి దిగారు. ఈ దాడిలో ఎమ్మెల్యే విల్సన్ చంపామారి వాహనం పూర్తిగా ధ్వంసమైంది.
ఈ దాడిలో ఎమ్మెల్యే స్వల్పంగా గాయపడ్డారు. దాడి వెనుక ఎవరు ఉన్నారనేది తెలియలేదు. నిరసన కారులు నల్ల జెండాలను చూపుతూ… గో బ్యాక్… గో బ్యాక్.. అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అయితే దిలీప్ ఘోష్ పై ఎవరు దాడికి దిగారన్నది మాత్రం ఇంకా తెలియ రాలేదు.
మదారిహాట్ నియోజకవర్గంలో ప్రచారం ముగించుకొని అధ్యక్షుడు దిలీప్ ఘోష్ తిరుగు ప్రయాణం అయ్యారు. ఈ సమయంలోనే జేజేఎంఎం కార్యకర్తలు నిరసన ప్రదర్శన చేస్తున్నారు. నల్ల జెండాలను కూడా చూపిస్తూ నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యకర్తలే దిలీప్ ఘోష్ కాన్వాయ్ పై దాడి చేశారన్నది కూడా ప్రచారంలో ఉంది. అయితే ఎవరు దాడి చేశారన్నది మాత్రం అధికారికంగా వెల్లడి కాలేదు.
More Stories
48 గంటల్లో సిట్ ముందు లొంగిపో.. ప్రజ్వల్కు హితవు
ఎన్నికల్లో విపక్ష కూటమికి గట్టి ఎదురుదెబ్బ
బాల్యం నుండి స్వయంసేవక్ నే… తిరిగి ఆర్ఎస్ఎస్ కోసం పనిచేస్తా!