పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇంగ్లీషు సిలబస్లో ప్రముఖ రచయిత్రి అరుంధతి రాయ్ రచించిన ‘వాకింగ్ విత్ ది కామ్రేడ్స్’ పుస్తకాన్ని పాఠ్యాంశంగా చేర్చడాన్ని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఎబివిపి) అభ్యంతరాలు వ్యక్తం చేసింది. దీంతో తిరువనెల్విలోని మనోన్మానియం సుందరనార్ విశ్వవిద్యాలయం ఆ పాఠాన్ని ఉపసంహరించుకుంది.
మావోయిస్టుల రహస్య స్థావరాల సందర్శన ఆధారంగా అరుంధతి ఈ పుసక్తం రచించారు. వైస్ చాన్సలర్ కె. పిచ్చుమణి నేతృత్వంలో జరిగిన ఈ సమావేశంలో పాఠ్యాంశాన్ని తొలగించాలన్న నిర్ణయం తీసుకున్నారు. ఈ పాఠ్యాంశం స్థానంలో ప్రకృతి శాస్త్రవేత్త ఎం కృష్ణన్ రచించిన ‘మై నేటివ్ ల్యాండ్ ఎస్సేస్ ఆన్ నేచర్’ నుండి కొన్ని వ్యాసాలతో భర్తీ చేయాలని నిర్ణయించారు.
అరుంధతీ రాయ్ రచించిన ఈ పుస్తకాన్ని 2017లో సిలబస్లో చేర్చామని, మావోయిస్టుల పట్ల రచయిత్రి అనుకూల వైఖరితో వ్యవహరిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని, ఈ అంశంపై చర్చించడానికి ఒక కమిటీని ఏర్పాటు చేశామని, ఆ పాఠ్యాంశాలను తొలగించాలని కమిటీ సిఫార్సు చేసినట్లు వైస్ చాన్సలర్ పేర్కొన్నారు.
ఎబివిపితో పాటు, ఇతరులు కూడా ఫిర్యాదు చేశారని, ఇతర సమస్యలు లేవనెత్తడంతో ఆ పుస్తకాన్ని సిలబస్ నుండి తొలగించాలని నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. ఈ పుస్తకం ఎంఎ ఇంగ్లీష్ మూడవ సెమిస్టర్లో భాగంగా సిలబస్గా మూడేళ్ల క్రితం చేర్చారు. ఆమె 2010 ఓ మ్యాగ్జైన్ కోసం ఈ వ్యాసం రాశారు.
జాతి వ్యతిరేకులైన మావోయిస్టుల..అల్లర్లు, హత్యలకు బహిరంగా మద్దతునిస్తున్నారని పేర్కొంటూ ఈ పాఠ్యాంశాన్ని తొలగించాలంటూ ఎబివిపి దక్షిణ తమిళనాడు జాయింట్ సెక్రటరీ సి. విఘ్నేష్ వైస్ చాన్సలర్కు ఫిర్యాదు చేయడంతో పాటు ఈ పుస్తకాన్ని పాఠ్యాంశంగా తొలగించకపోతే కేంద్ర విద్యా శాఖకు ఫిర్యాదు చేస్తానని బెదిరించారు. దీంతో పాటు ఆర్ఎస్ఎస్ సైతం ఈ పుస్తకానికి వ్యతిరేకత వ్యక్తం చేసింది.
More Stories
ఓటు బ్యాంకు రాజకీయాల కోసమే మత ప్రాతిపాదక రిజర్వేషన్లు
సెక్స్ రాకెట్ లో ఎట్టకేలకు ప్రజ్వల్ రేవణ్ణపై వేటుకు సిద్ధం!
మూడు ప్రధాన విమానాశ్రయాలకు బాంబు బెదిరింపులు