అయోధ్య రామాలయం సీఈవోగా నియమితులైన మాజీ ఎయిర్ మార్షల్ జితేంద్ర మిశ్రా రామభక్తుల మద్దతు, దీవెనలు తమకు ముఖ్యమని ఆయన తెలిపారు. రామ ట్రస్టు వ్యూహాలు త్వరలో ఆచరణలోకి రానున్నట్లు ఆయన చెప్పారు. ట్రస్టు సభ్యులతో సమావేశం నిర్వహించిన తర్వాత శుక్రవారం జితేంద్ర మిశ్రా మీడియాతో మాట్లాడుతూ భక్తుల విశ్వాసం, దీవెనలు తమ పట్ల ఉండాలని ఆశిస్తున్నట్లు తెలిపారు.
“మీ దీనవలు, నమ్మకంతోనే మేం ముందుకు వెళ్తామని, నాకు కొంత సమయం ఇవ్వండి” అంటూ మిశ్రా పేర్కొన్నారు. శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు బుధవారం మిశ్రాను తొలి సీఈవోగా నియమించిన విషయం తెలిసిందే. అయోధ్య రామాలయ వ్యవహార శైలిని సంపూర్ణంగా అర్థం చేసుకోవడానికి ఆయన ప్రయత్నిస్తున్నారు. కొన్ని రోజుల్లో తమ వ్యూహాలు అమలులోకి రానున్నట్లు ఆయన చెప్పారు. వివిధ బృందాల సహాకారంతో ఆయోధ్య ఆలయంలో చర్యలు చేపట్టనున్నట్లు ఆయన వెల్లడించారు.
కీలకమైన నిర్ణయాలను మీడియాకు వెల్లడిస్తామని పేర్కొంటూ తనకు సీఈవో బాధ్యతలు అప్పగించిన శ్రీరాముడికి ఆయన కృతజ్ఞతలు చెప్పారు. ట్రస్టు జనరల్ సెక్రటరీ గోవింద దేవ్ గిరి సమక్షంలో వైదేహి భవన్లో సమావేశం నిర్వహించారు. ట్రస్టు మార్గదర్శకాలతోనే భవిష్యత్తు వ్యూహాలను రచించనున్నట్లు చెప్పారు. రామాలయ సెక్రటరీగా గిరి, ట్రెజరర్గా మహేశ్ భాగ్చంద్కా నియమితులయ్యారు. ఆపరేషన్ సింధూర్ సమయంలో వెస్ట్రన్ ఎయిర్ కమాండ్కు జీతేంద్ర మిశ్రా హెడ్గా ఉన్న విషయం తెలిసిందే.

More Stories
సింధు జలాలపై లడఖ్లో మొదటి రాతి చెక్ డ్యామ్
బెంగాల్ ప్రతిపక్ష నేత లైంగిక దాడి ఆరోపణలపై విచారణకు కేంద్రం ఆదేశం
సంజయ్ జైస్వాల్ (బిజెపి) నేతృత్వంలో ఎఫ్సిఆర్ఎపై జెపిసి