ఒడిశా తీరానికి సమీపంలో కార్గో నౌక మునక.. 22 మంది గల్లంతు

ఒడిశా తీరానికి సమీపంలో కార్గో నౌక మునక.. 22 మంది గల్లంతు

భారతదేశ తూర్పు సముద్ర తీరంలోని బంగాళాఖాతంలో, 20 మంది చైనా జాతీయులతో సహా 24 మంది సిబ్బందితో ప్రయాణిస్తున్న పనామా జెండా కలిగిన ఒక సరుకు రవాణా నౌక మునిగిపోయింది. ఒడిశాలోని పారాదీప్ తీరానికి సుమారు 240 నాటికల్ మైళ్ల దూరంలో శనివారం ఈ ప్రమాదం జరిగింది.   ప్రమాదం సమాచారం అందిన వెంటనే భారత కోస్ట్ గార్డ్, నేవీ సంయుక్తంగా గాలింపు, సహాయక చర్యలు చేపట్టాయి. ఇప్పటివరకు ఇద్దరిని సముద్రంలో నుంచి రక్షించినట్లు అధికారులు తెలిపారు. మిగిలిన వారి కోసం గాలింపు కొనసాగుతోంది.

ఎంవీ ఓషన్ విన్నర్ అనే ఈ నౌక ఆగస్టు 20న రాత్రి సుమారు 10.42 గంటలకు పారాదీప్ నుంచి బయలుదేరింది. ఒడిశా నుంచి సింగపూర్‌కు వెళ్తున్న ఈ నౌకలో 72,100 మెట్రిక్ టన్నుల ఇనుప ఖనిజం ఉన్నట్లు అధికారులు తెలిపారు. నౌకలో ఉన్న 24 మంది సిబ్బందిలో 20 మంది చైనా, ముగ్గురు మయన్మార్, ఒకరు బంగ్లాదేశ్‌కు చెందినవారు ఉన్నారు. ఆగస్టు 22న ఉదయం 11.48 గంటలకు ఎంవీ ఓషన్ విన్నర్‌తో సంబంధాలు తెగిపోయినట్లు శ్రీ విజయపురంలోని సముద్ర రక్షణ సమన్వయ కేంద్రానికి సమాచారం అందింది.

నౌకను నిర్వహిస్తున్న సంస్థ నుంచి సమాచారం అందడంతో అధికారులు వెంటనే రక్షణ చర్యలను ప్రారంభించారు. నౌక మునిగినట్లు నిర్ధారణ కావడంతో భారత కోస్ట్ గార్డ్, నేవీ సంయుక్తంగా భారీ రక్షణ చర్యలు చేపట్టాయి. కోస్ట్ గార్డ్‌కు చెందిన వరద్, అన్మోల్ నౌకలను గాలింపు కోసం పంపించారు. శ్రీ విజయపురం నుంచి విజిత్ నౌకను కూడా సహాయక చర్యలకు మోహరించారు.

సమీపంలో ప్రయాణిస్తున్న ఇతర నౌకలను సైతం అప్రమత్తం చేసి రక్షణ చర్యల్లో సహకరించాలని కోరారు.  ఆ నౌకలో మొత్తం 24 మంది సిబ్బంది ఉన్నారు, వీరిలో 20 మంది చైనా జాతీయులు, 3 మంది మయన్మార్ దేశస్థులు, ఒకరు బంగ్లాదేశ్ దేశస్థులు ఉన్నారు. ఈ ప్రమాదం మిగిలిన 22 మంది సిబ్బంది భద్రతపై ఆందోళనలను రేకెత్తించింది. వారి కోసం పలు సహాయక బృందాలు గాలిస్తున్నాయి.

ప్రమాద స్థలం సమీపంలోని ఇతర నౌకలను కూడా అధికారులు అప్రమత్తం చేశారు. సహాయక చర్యలలో పాల్గొనాలని వారికి సూచించారు.