నోటీసు ప్రక్రియ నెల రోజుల పాటు కొనసాగుతుందని ఎన్నికల సంఘం తెలిపింది. ఆ తర్వాత మరో నెల పాటు అభ్యంతరాలు, వివరణలు తీసుకుంటారు. ప్రక్రియ అంతా ముగిశాక తుది ఓటరు జాబితా ప్రకటించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఓటర్లు తమ పేరు జాబితాలో ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలని ఎన్నికల అధికారులు సూచించారు. నోటీసులు అందుకున్న వారు సెప్టెంబర్ 16లోగా స్పందించాల్సి ఉంటుందని అధికారులు వెల్లడించారు.
ఎస్ఐఆర్ ముసాయిదా జాబితాలో మీ పేరు వెతకడానికి ముందుగా మీ ప్రస్తుత పోలింగ్ బూత్, పార్ట్ నంబర్ తెలుసుకోవడం ఉపయోగకరంగా ఉంటుందని ఎన్నికల సంఘం అధికారులు పేర్కొన్నారు. పోలింగ్ కేంద్రాల సంఖ్య పెరగడంతో కొంతమంది ఓటర్ల పాత బూత్ నంబర్లు మారే అవకాశం ఉందని తెలిపారు. అందువల్ల ఎన్నికల సంఘం సెర్చ్ పోర్టల్లో ఎపిక్ నంబర్ లేదా అందుబాటులో ఉన్న వ్యక్తిగత వివరాలతో మీ పోలింగ్ కేంద్రం వివరాలను తెలుసుకోవచ్చని సూచించారు.

More Stories
రియల్ ఎస్టేట్ బ్రోకర్లా మారిన రేవంత్ రెడ్డి
పార్టీ కంటే అభ్యర్థే ప్రధానం అంటున్న తెలంగాణ పట్టభద్రులు
వందేమాతరం అవమానించిన కాంగ్రెస్.. బీజేవైఎం నిరసన