“కాంగ్రెస్ 1969లో దమన కాండ జరిపింది. ఎంతో మంది విద్యార్థుల మరణానికి కారణమైంది. కానీ బీజేపీ మాత్రం తెలంగాణ ఏర్పాటులో ఇచ్చిన మద్దతు చాలా గొప్పది. 1997లో కాకినాడలో బీజేపీ ఏర్పాటు చేసిన సభలో కూడా. తెలంగాణ ఏర్పాటు గురించి స్పష్టంగా హామీ ఇచ్చాం. అప్పుడు కేవలం రాజకీయంగా చేసిన వాగ్దానం కాదు తెలంగాణ కోసం బీజేపీ సంకల్పంతో చెప్పిన మాటలు” అని స్పష్టం చేశారు.
తెలంగాణ అభివృద్ధికి, తెలంగాణ ప్రజల సంస్కృతిని కాపాడేందుకు బీజేపీ కృషి చేస్తుందని నితిన్ నబీన్ హామీ ఇచ్చారు. 2009 డిసెంబర్ 9న కేంద్ర ప్రభుత్వం తెలంగాణ ఏర్పాటు చేస్తామని ప్రకటించి మోసం చేసిన విషయం అందరికీ గుర్తుండే ఉంటుందని పేర్కొంటూ దీంతో తెలంగాణలోని అనేక మంది యువతీ యువకులు తమ ప్రాణత్యాగాలు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.
గత 12 సంవత్సరాలుగా ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో తెలంగాణ అభివృద్ధి కోసం, వికసిత భారత్ లో తెలంగాణను భాగస్వామ్యం చేసేందుకు ఎంతో కృషి చేస్తున్నామని తెలిపారు. 31 లక్షల మంది తెలంగాణ రైతులకు పీఎం కిసాన్ యోజన నిధులు, 75 లక్షలకు పైగా లబ్ధిదారులకు ముద్ర యోజన రుణాలు, 1.27 కోట్ల జనధన్ ఖాతాలు, ఆయుష్మాన్ కార్డులను అందజేశాం. రైల్వే, రోడ్డు ప్రాజెక్టులను భారీగా తెలంగాణకు మంజూరు చేశామని వివరించారు. బీబీనగర్ లో ఎయిమ్స్ వంటి ప్రతిష్టాత్మక సంస్థను ఇచ్చామని చెప్పారు.
2047 నాటికి వికసిత భారత్ సాధించాలన్న లక్ష్యంతో పాటు సమృద్ధ తెలంగాణ ఏర్పాటు చేసేందుకు పాటుపడతామని బిజెపి అధ్యక్షుడు స్పష్టం చేశారు. రాష్ట్రంలో అవినీతి పాలనకు చరమగీతం పాడి, తెలంగాణ అమరవీరులు కలలు కన్న తెలంగాణను పునర్మించుకోవాల్సిన అవసరం ఉందని ఆయన చెప్పారు. తెలంగాణను కొందరు ఏటీఎంలాగా మార్చుకుని, కాంగ్రెస్ జేబులు నింపుతున్నారని మండిపడుతూ దీన్ని ఆపేందుకు భవిష్యత్తులో బీజేపీ కార్యకర్తలంతా కలసి పోరాడుతామని ప్రకటించారు. తెలం
ప్రత్యేక రాష్ట్రం సిద్ధించిన నేపథ్యంలో, ఇప్పుడు మన ప్రయాణం మరింత అభివృద్ధి, ప్రగతి వైపు సాగాలని రాష్ర బిజెపి అధ్యక్షుడు ఎన్ రాంచందర్ రావు పిలుపునిచ్చారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం తెలంగాణ అభివృద్ధికి పూర్తిగా కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. ‘వికసిత్ భారత్’ (వికసిత భారతదేశం) అనే బృహత్ సంకల్పంలో భాగంగా మనమంతా కలిసికట్టుగా ‘వికసిత్ తెలంగాణ’ లక్ష్యం కోసం కృషి చేయాలని కోరారు.
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య ఉన్న సోదరభావాన్ని, బంధాన్ని ప్రస్తావిస్తూ రెండు రాష్ట్రాలు పరస్పర స్నేహంతో, ఆరోగ్యకరమైన అభివృద్ధి పోటీతో ముందుకు సాగాలని రాంచందర్ రావు సూచించారు. “తెలుగు ప్రజలమైన మనకు రెండు రాష్ట్రాలు ఉన్నాయి. మన మధ్య ఎటువంటి ద్వేషాలు, విభేదాలు ఉండకూడదు.. కేవలం అభివృద్ధిలో మాత్రమే ఆరోగ్యకరమైన పోటీ ఉండాలి” అని తేల్చి చెప్పారు.

More Stories
మమతాకు ముఖం చాటేసిన టిఎంసి ఎంపీలు, ఎమ్యెల్యేలు
పవన్ కళ్యాణ్ ప్రెస్మీట్ కు కాంగ్రెస్ నేతలకు అభ్యంతరమా?
సీబీఎస్ఈలో భారీ ప్రక్షాళన.. చైర్మన్, కార్యదర్శుల మార్పు!