శని జయంతి, అమావాస్య, శనివారం కలిసిన పవిత్ర సందర్భంలో, ఏఈ ఫౌండేషన్ నారీ-శక్తి రామ్-సేవికా బృందానికి చెందిన 40 మంది సభ్యులతో కలిసి హైదరాబాద్లోని `వైదేహి సేవా సమితి’ మహిళల అనాథాశ్రమంలోని బాలికల కోసం సామూహిక అన్నదానాన్ని నిర్వహించింది. ఈ సంస్థ ప్రస్తుతం దాదాపు 60 మంది అణగారిన బాలికలకు సంరక్షణ, ఆశ్రయం, విద్యను అందిస్తోంది.
కారుణ్యం సంస్కృతిగా మారినప్పుడు పవిత్ర కార్యం కోసం హైదరాబాద్ మహిళలు ఏకమవడం జరిగింది. ఈ కార్యక్రమంలో 40 మంది మహిళా వాలంటీర్లు చురుకుగా పాల్గొని, నిత్యావసర సరుకులు, శానిటరీ న్యాప్కిన్లు, ఆర్థిక సహాయాన్ని అందించారు. వారి సహకారం భౌతిక సాయానికి మించి బాలికలకు గౌరవం, మానసిక ధైర్యాన్ని అందించింది.
అన్నదానం అనేది ఆకలిగొన్నవారికి ఆహారం పెట్టడమే కాకుండా, సామాజిక సామరస్యాన్ని, సమానత్వాన్ని బలోపేతం చేసే పవిత్ర సాంస్కృతిక ఆచారమని నిర్వాహకులు పేర్కొన్నారు.
ఇలాంటి సామూహిక దానం ద్వారా పిల్లలు అనుభూతి ద్వారా సానుభూతిని నేర్చుకుంటారు. సమాజం మానవీయంగా మారుతుంది. అమావాస్య, శనివారం, శని జయంతి కలయికను అహంకారాన్ని తగ్గించి, వినయాన్ని స్వీకరించి, బాహ్య ప్రదర్శన కంటే అర్థవంతమైన సేవను ఎంచుకోవాలనే ఆధ్యాత్మిక సందేశంగా వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమం ద్వారా ఏఈ ఫౌండేషన్, నారీ-శక్తి రామ్-సేవికా బృందం ఒక ముఖ్యమైన సామాజిక సందేశాన్ని పునరుద్ఘాటించాయి: స్త్రీత్వానికి నిజమైన గౌరవం అంటే ఏ బాలిక లేదా మహిళ కూడా సంరక్షణ వలయానికి వెలుపల ఉండకుండా చూడటమే.
“ఆకలిగొన్నవారికి ఆహారం పెట్టేవరకు విశ్వాసం అసంపూర్ణమే” అని ఒక వాలంటీర్ వ్యాఖ్యానించారు. “జై శ్రీ రామ్” నామస్మరణల మధ్య జరిగిన ఈ కార్యక్రమం ఆధ్యాత్మికత, సామూహిక బాధ్యత కలిసినప్పుడు ఎలా శాశ్వత సామాజిక మార్పును తీసుకురాగలదో చాటింది.

More Stories
హామీల అమలు లేకుండా పగటి కలలు కంటున్నా రేవంత్!
జగిత్యాలలో కేంద్రీయ విద్యాలయం కోసం బీజేపీ పోరాటంలో ఉద్రిక్తత
ఈనెల 21 నుండి జూన్ 1 వరకు సరస్వతీ నదీ అంత్య పుష్కరాలు