అమెరికా- ఇజ్రాయెల్తో ఇరాన్ యుద్ధం కారణంగా ప్రపంచవ్యాప్తంగా చమురు రవాణాకు అంతరాయం ఏర్పడింది. ఈ క్రమంలో విడతల వారీగా కమర్షియల్ సిలిండర్ ధరలను చమురు సంస్థలు పెంచాయి. ఫిబ్రవరి 28 తర్వాత కమర్షియల్ సిలిండర్ ధరలు పెరగడం ఇది మూడోసారి కావడం గమనార్హం. మార్చి ప్రారంభంలో సుమారు రూ.115 పెరిగిన ధరలు, ఏప్రిల్ 1న 200 వరకు పెరిగాయి.
ఇప్పుడు ఒకేసారి రూ.993 పెంచారు. దీంతో ఒక్క వాణిజ్య సిలిండర్ ధర రూ.3వేలు దాటింది. తాజా పెంపుతో హోటళ్లు, రెస్టారెంట్లు, చిన్న వ్యాపారాలపై అదనపు భారం పడనుంది. ఇంధన ధరల విషయంలో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసి) తెలిపిన వివరాల ప్రకారం పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్2లో ఇంధన ధరలు పెరిగినప్పటికీ ఆయిల్ కంపెనీలు వాటిని భరిస్తున్నాయని తెలిపింది.
దీంతో ప్రస్తుతానికి పెట్రోల్, డీజిల్ ధరల్లో మార్పులేదు. ఇక దేశీయ ఎయిర్లైన్స్కు విమాన ఇంధనం (ఏటీఎఫ్) ధరలను కూడా కేంద్రం యథాతథంగా ఉంచింది. అంతర్జాతీయ విమానాల కోసం మాత్రం స్వల్పంగా ధరలను పెంచారు.

More Stories
ఈ20 ఇంధన సరఫరాకు భూటాన్ నిరాకరణ
టెలిగ్రామ్ పైరేటెడ్ మూవీస్, ఓటీటీ కంటెంట్ తొలగించాల్సిందే
బద్రీనాథ్లోనూ కానుకల చోరీపై విచారణ