ఫిబ్రవరి 28 నుండి అమెరికా-ఇజ్రాయెల్ దళాలు ఇరాన్పై 35 రోజుల నుంచి సాగిస్తున్న సమరంలో ఇరాన్ ఆయుధాలను చాలావరకు నిర్వీర్యం చేశామని అమెరికా దళాలు పేర్కొంటున్నాయి. లాంచర్లు, డ్రోన్లతో పాటు అనేక ఆయుధ సామాగ్రిని అమెరికా ధ్వంసం చేసిన్నట్లు చెబుతున్నాయి. అయితే, నెల రోజులకు పైగా అమెరికా, ఇజ్రాయెల్ బాంబు దాడులు జరుగుతున్నప్పటికీ, ఇరాన్ బాలిస్టిక్ క్షిపణి లాంచర్లలో దాదాపు సగం ఇప్పటికీ చెక్కుచెదరకుండా ఉన్నాయని అమెరికా నిఘా వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.
తాజాగా వెల్లడైన అమెరికా ఇంటెలిజెన్స్ విభాగం నివేదిక ప్రకారం ఇరాన్కు చెందిన ఆయుధ సంపదలో సగం కూడా ధ్వంసం కాలేదు. ఈ నివేదికను సీఎన్ఎన్ వార్తా సంస్థ ప్రచురించింది. ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ ద్వారా ఇరాన్ ఆయుధ డిపోలను టార్గెట్ చేసిన ఇరానీ మిస్సైల్ లాంచర్లు, కమికేజ్ డ్రోన్లలో సగం ఆయుధ సామాగ్రి ఇంకా సుస్థిరంగానే ఉన్నట్లు ఇది స్పష్టం చేసింది.
ఇరాన్ వద్ద ఇంకా భారీ సంఖ్యలో మిస్సైల్ నిల్వలు ఉన్నట్లు తేలింది. ఈ రహస్య సమాచారాన్ని మూడు విభాగాలు వెల్లడించినట్లు తెలుస్తోంది. ఇరాన్ వద్ద ఇంకా ఆయుధ నిల్వలు భారీగానే ఉన్నా శిథిలాల కింద ఉన్న వాటిని ప్రస్తుతం వాడే స్థాయిలో లేనట్లు తెలిసింది. ఇరాన్ తీరం వెంట షార్ట్ రేంజ్ క్రూయిజ్ మిస్సైళ్లు ఉన్నట్లు భావిస్తున్నారు. చిన్న చిన్న నౌకలతో పాటు సర్ఫేస్ డ్రోన్లు కూడా కొన్ని వందల సంఖ్యలో ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. హోర్ముజ్ జలసంధిలో వాటిని మోహరించినట్లు పేర్కొన్నారు.
అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ప్రభుత్వ అధికారులు బహిరంగంగా వెల్లడించిన సైనిక విజయం గురించిన విస్తృత అంచనాలతో పోలిస్తే, ఈ నిఘా సమాచారం ఇరాన్ కొనసాగుతున్న సామర్థ్యాల గురించి మరింత సూక్ష్మమైన చిత్రాన్ని అందిస్తుంది. బుధవారం సాయంత్రం దేశ ప్రజలను ఉద్దేశించి చేసిన ప్రసంగంలో ట్రంప్ మాట్లాడుతూ, ఇరాన్ “క్షిపణులు, డ్రోన్లను ప్రయోగించే సామర్థ్యం గణనీయంగా తగ్గిపోయింది. వారి ఆయుధ కర్మాగారాలు, రాకెట్ లాంచర్లు ముక్కలు ముక్కలుగా పేల్చివేయబడుతున్నాయి. వాటిలో చాలా తక్కువ మాత్రమే మిగిలి ఉన్నాయి” అని చెప్పారు.
యుఎస్ సెంట్రల్ కమాండ్ తెలిపిన వివరాల ప్రకారం, బుధవారం నాటికి అమెరికా ఇరాన్ భూభాగంలో 12,300కు పైగా లక్ష్యాలపై దాడులు జరిపింది. ధ్వంసం చేసిన వాటి గురించి కాకుండా, ఇరాన్ ప్రయోగించిన మొత్తం క్షిపణుల సంఖ్య తగ్గిందని పెంటగాన్ పేర్కొంది. అయితే, భూగర్భంలోకి వెళ్ళగల సామర్థ్యమే లాంచర్లు మరింతగా బలహీనపడకపోవడానికి ఒక ప్రధాన కారణమని, ఇటీవలి అంచనాతో పరిచయం ఉన్న ఇద్దరు వ్యక్తులు సిఎన్యెన్ కు తెలిపారు.
ఇరాన్ దశాబ్దాలుగా ఇలాంటి సంఘర్షణకు సిద్ధమవుతూ, తన లాంచర్లను విస్తృతమైన సొరంగాలు,గుహల నెట్వర్క్లలో దాచిపెడుతోంది. దీనివల్ల వాటిని లక్ష్యంగా చేసుకోవడం చాలా కష్టంగా మారింది. ఇరాన్ తన ప్రధాన ప్రాక్సీ దళాలలో ఒకటైన యెమెన్లోని హౌతీలతో ఎదుర్కొన్న సవాళ్ల మాదిరిగానే, ఈ మొబైల్ ప్లాట్ఫారమ్లను కాల్చివేసి, వాటిని తరలించడంలో విజయం సాధించిందని, తద్వారా లాంచర్లను గుర్తించడం కష్టంగా మారిందని ఆ ఇద్దరు వ్యక్తులు తెలిపారు.
కాగా, తాజాగా నిర్వహించిన ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీలో ఇరాన్కు చెందిన మారీటైం ఆస్తులను అమెరికా ఇంకా టార్గెట్ చేయలేదని తెలిసింది. ఇజ్రాయల్, గల్ఫ్ దేశాలను టార్గెట్ చేస్తున్న లాంగ్ రేంజ్ సిస్టమ్స్ను మాత్రమే ఇప్పటి వరకు టార్గెట్ చేశారు. ఇరాన్ కు చెందిన లాంచ్ సామర్ధ్యం 70 శాతం నిర్వీర్యమైనట్లు తెలిసింది. బాలిస్టిక్ మిస్సైల్ లాంచర్లు ఇంకా చాలానే ఇరాన్ వద్ద ఉన్నట్లు మిలిటరీ రిపోర్టులో పేర్కొన్నారు.
ఇరాన్ వద్ద ఉన్న 470 బాలిస్టిక్ క్షిపణి లాంచర్లలో 60 శాతం ఆయుధాలను ధ్వంసం చేసినట్లు ఇటీవల ఇజ్రాయెల్ పేర్కొన్నది. అయితే దీనిపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. అమెరికా, ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ వర్గాల మధ్య ఉన్న తేడా కొంత అయోమయాన్ని సృష్టిస్తున్నది.
ఇజ్రాయెల్ అంచనా ప్రకారం, దాడులలో సుమారు 200 లాంచర్లు ధ్వంసమయ్యాయి. వాటిని నిల్వ ఉంచిన భూగర్భ సౌకర్యాల సొరంగ ప్రవేశ ద్వారాలపై ఐఏఎఫ్ దాడి చేయడంతో, మరో 80 లాంచర్లు పనిచేయడం లేదని భావిస్తున్నారు. ఇదిలా ఉండగా, ఇరాన్ వద్ద ఇప్పటికీ వేలాది దాడి డ్రోన్లు నిల్వ ఉన్నాయని, అవి ఉపయోగించడానికి సిద్ధంగా ఉన్నాయని అమెరికా నిఘా వర్గాలు అంచనా వేశాయి.
అదనంగా, ఇరాన్ నౌకాదళం చాలా వరకు నిర్వీర్యమైనప్పటికీ, ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (ఎల్పీజీ) నౌకాదళం వద్ద “వందలాది, కాకపోతే వేలాది చిన్న పడవలు, మానవరహిత ఉపరితల నౌకలతో” సహా దాదాపు సగం సామర్థ్యాలు చెక్కుచెదరకుండా ఉన్నాయని ఆ వర్గాలు తెలిపాయి. హోర్ముజ్ జలసంధిలో నౌకాయానానికి ఆటంకం కలిగించడంలో ఐఆర్జిసియే ప్రధాన బాధ్యత వహిస్తోంది. ఈ ప్రాంతం అంతటా సంపూర్ణ విధ్వంసం సృష్టించడానికి ఇరాన్ ఇంకా పూర్తి సిద్ధంగా ఉందని సిఎన్ఎన్ కథనం హెచ్చరిస్తున్

More Stories
పహల్గమ్ ఉగ్రవాదులను మట్టుబెట్టిన ‘ఆపరేషన్ మహాదేవ్’
ప్రపంచానికి జీవితంపై భారత్ దృక్పథం అవసరం
ప్రధాని మోదీ ఒక ‘ఉగ్రవాది’.. ఖర్గే వ్యాఖ్యలపై రాజకీయ దుమారం