ఈ వ్యవహారంలో సివిల్ సర్వీస్ నియమావళికి విరుద్ధంగా ప్రవర్తించారని పేర్కొంటూ, ఐపీఎస్ సునీల్ కుమార్పై డిస్మిసల్ ప్రొసీడింగ్స్ను వెంటనే ప్రారంభించాలని రఘురామకృష్ణరాజు డీజీపీని కోరారు. సేవా నియమాలు ప్రభుత్వ ఉద్యోగుల నుంచి నిష్పక్షపాతత్వం, పరిమితి, గౌరవాన్ని ఆశిస్తాయని, అవి అతిక్రమితమైతే కఠిన చర్యలు తప్పవని ఆయన తెలిపారు.
ప్రభుత్వ అధికారుల మాటలు ప్రజల్లో నమ్మకాన్ని ప్రభావితం చేస్తాయని, కాబట్టి సోషల్ మీడియా వేదికగా నిరాధార ఆరోపణలు చేయడం ప్రజాస్వామ్యానికి హానికరమని ఫిర్యాదులో ఆయన స్పష్టం చేశారు. మరోవంక, ఇపిఎక్స్ సునీల్ కుమార్ తన వాదనలో మరింత తీవ్ర ఆరోపణలు చేశారు. రఘురామకృష్ణరాజుపై రూ.945 కోట్లకు సంబంధించిన అక్రమాల ఆరోపణలు చేస్తూ, త్వరలో అరెస్టు జరిగే అవకాశం ఉందని వ్యాఖ్యానించినట్లు సమాచారం. ఈ పరస్పర ఆరోపణలతో వ్యవహారం రాజకీయంగానూ, న్యాయపరంగానూ మరింత ఉత్కంఠకు దారి తీస్తోంది.

More Stories
పవన్ కళ్యాణ్ ఆగ్రహంతో విప్ పదవికి అరవ శ్రీధర్ రాజీనామా
తెలుగు రాష్ట్రాల్లో భానుడి భగభగలు.. ఒక్కరోజే 30 మంది మృతి
జనసేన ఫిర్యాదుతో ప్రొఫెసర్ నాగేశ్వర్పై కేసు