
గిరిజన సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరు లక్ష్మణ్ ఈ భారీ నిధుల మంజూరుపై హర్షం వ్యక్తం చేశారు. గతంలో ఎన్నడూ లేని విధంగా జాతరను ఘనంగా నిర్వహించేందుకు నిధులు మంజూరు చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరు లక్ష్మణ్ లకు మంత్రి సీతక్క ధన్యవాదాలు తెలిపారు. ఈ నిర్ణయం మేడారం జాతర ప్రాముఖ్యతను మరింత పెంచుతుందని, భక్తులకు మెరుగైన సౌకర్యాలు అందుతాయని ఆమె పేర్కొన్నారు.
ఈ భారీ నిధుల కేటాయింపుతో జాతర నిర్వాహకులు, అధికారులు ఉత్సాహంగా ఉన్నారు. జాతరకు వచ్చే లక్షలాది మంది భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసేందుకు పటిష్టమైన ఏర్పాట్లు చేయనున్నారు. తాగునీటి సరఫరా, పారిశుద్ధ్యం, రవాణా, వైద్య సదుపాయాలపై ప్రత్యేక దృష్టి సారించనున్నారు. ఈ నిధులు జాతర విజయవంతానికి, భక్తులకు సౌకర్యవంతమైన అనుభూతిని అందించడానికి ఎంతగానో తోడ్పడతాయని అధికారులు భావిస్తున్నారు.
More Stories
సందడిగా దత్తాత్రేయ `అలయ్ బలయ్’
మాలవీయ మిషన్ పేద విద్యార్థులకు ఆర్థిక సహాయం
స్థానిక సంస్థల ఎన్నికల్లో బిజెపి అభ్యర్థుల ఎంపిక ప్రారంభం