
నాసా క్యూరియాసిటీ రోవర్ తాజాగా మార్స్పై ఓ రహస్య ప్రాంతంలో తవ్వకాలు చేపట్టగా అక్కడ భూగర్భంలో నీరు చాలాకాలం పాటు క్రియాశీలంగా ఉన్నట్లు ఆధారాలు లభించాయి. నాసాకు చెందిన క్యూరియాసిటీ రోవర్ ప్రస్తుతం మౌంట్ షార్ప్ భాగంలోని బాక్స్వర్క్ ప్రాంతాన్ని పరిశీలిస్తోంది. ఇది మార్స్ ఉపరితలంపై 12 మైళ్ల పొడవున విస్తరించి ఉంది.
ఇప్పటి వరకు ఇది కేవలం ఉపగ్రహాల ద్వారా మాత్రమే గమనించిన ఈ ప్రాంతానికి తొలిసారిగా రోవర్ చేరుకుంది. ఇక్కడి రాళ్లలో రాళ్లలో మెగ్నీషియం సల్ఫేట్, కాల్షియం సల్ఫేట్ వంటి ఉప్పు ఖనిజాలు అధికంగా ఉన్నట్లు గుర్తించింది. ఇవి సాధారణంగా నీరు ఆవిరైపోయిన తర్వాతే ఏర్పడుతాయి. దాంతో అక్కడ గతంలో నీరు ఉందని, ఆ తర్వాత వాతావరణంలోని మార్పులతో ఎండిపోయి ఎడారిని తలపిస్తున్నట్లుగా సూచిస్తున్నది.
కేవలం మట్టి, ఖనిజాలే కాకుండా రాళ్లలో మినరల్ వీన్స్ని సైతం గుర్తించారు. నీరు చాలా కాలం పాటు భూగర్భంగా ప్రవహించి ఉండే అవకాశం ఉందని తెలుస్తున్నది. ఇది నిజమైతే, మార్స్పై జీవనానికి అనువైన వాతావరణం భావించిన దానికంటే ఎక్కువ కాలం పాటు కొనసాగినట్లుగా అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం రోవర్ రాళ్లను తవ్వి నమూనాలను సేకరిస్తోంది.
వాటిని విశ్లేషించగా మార్స్ జలరాశులకు సంబంధించిన చరిత్ర, గ్రహ నిర్మాణ పరిణామాలపై కీలక సమాచారం లభించే అవకాశం ఉంది. మార్స్తో పాటు ఇతర గ్రహాలు, పలు గ్రహాల ఉపగ్రహాల్లోనూ నీటి ఉనికిని గుర్తించారు. భూమి ఉపగ్రహమైన చంద్రుడి ఉపరితలంపై 2009లో భారత్ చేపట్టిన చంద్రయాన్-1 మిషన్ ద్వారా దక్షిణ ధ్రువ ప్రాంతంలో నీటి జాడలను గుర్తించారు.
అలాగే, జూపిటర్ ఉపగ్రహమైన మూరోపాలోనూ మంచుతో కప్పిన ఉపరితంలోని లోతుల్లో భారీ జలరాశులు ఉన్నట్లు శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. బృహస్పతి ఉపగ్రహమైన గానిమీడ్ భూగర్భంలో సముద్రం ఉండే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. శని ఉపగ్రమైన ఎన్సెలడస్ ఉపరితలంలో నీరు మంచురూపంలో ఉందని అంచనా. టైటాన్లో మీథేన్, ఇథేన్ నిండిన ఉపగ్రహం.. ఉపరితంలో నీటి సముద్రం ఉండవచ్చని పరిశోధకులు భావిస్తున్నారు.
More Stories
కోయంబత్తూరు పేలుళ్ల నిందితుడు 29 ఏళ్ళకు అరెస్ట్
యువతలో పెరుగుతున్న అక్యూట్ మైలోయిడ్ లుకేమియా
గుజరాత్లో వంతెన కూలి 10 మంది మృతి